పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభం
జిల్లాలో తొలి రోజు 53,382 మంది రైతులకు సాయం
బ్యాంకు ఖాతాల్లో రూ.16,06,85,698 జమ
మెసేజ్లు రావడంతో మురిసిన రైతులు
మొత్తం లబ్ధిదారులు 1,49,837
రూ. 136,32,97,679 కేటాయించిన ప్రభుత్వం
జిల్లాలో రైతుబంధు సంబురం నెలకొంది. వానకాలం సీజన్లో రైతులకు పంట పెట్టుబడి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి రోజు ఎకరం విస్తీర్ణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5వేల చొప్పున జమ చేసింది. సెల్ఫోన్కు వచ్చిన మెసేజ్లు చూసి రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి నగదు అందుకొని సంబురపడ్డారు. పంట పెట్టుబడికి ఇక రంది లేదని మురిసిపోయారు. మొదటి రోజు మంగళవారం 53, 382 మంది అకౌంట్ల లో రూ.16,06, 85, 698 జమయ్యాయి. మిగతా వారికి వారం రోజుల్లో విడుతల వారీగా డబ్బులు పడనున్నాయి.
వరంగల్, జూన్28(నమస్తేతెలంగాణ): వ్యవ సాయంలో రైతులకు ఆర్థికంగా తోడ్పడేందుకు సీఎం కేసీఆర్ రైతు బంధు పథకానికి రూపకల్పన చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వానకా లం, యాసంగి పంట పెట్టుబడి కోసం రెండు వి డుతల్లో ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. ఈ ఏడాది వానకాలం రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 1,49,837 మంది రైతు లకు పంట పెట్టుబడి సాయం పంపిణీకి రూ. 136,32,97,679 కేటాయించింది. సీజన్ ప్రా రంభమైనందున ఈ నెల 28 నుంచి రైతులకు పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ అధికార యంత్రాం గాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఎకరంలోపు విస్తీ ర్ణం గల రైతులను గుర్తించి ఒకరోజు ముందుగానే సోమవారం రైతుబంధు నిధులను ట్రెజరీకి పం పారు. మంగళవారం ఉదయం నుంచి ఎకరం లోపు విస్తీర్ణం గల రైతుల బ్యాంకు ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కావడం మొద లైంది. జిల్లాలోని పదమూడు మండలాల్లో తొలి రోజు 53,382 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 16,06,85,698 రైతుబంధు నిధులను ప్ర భుత్వం జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ వెల్లడించారు.
తొలిరోజు అత్యధికం గా జిల్లాలో దుగ్గొండి మండలం నుంచి 5,430 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రైతు బంధు నిధులను జమ చేసింది. మండలం వారీగా మంగళవారం చెన్నారావుపేటలో 3,967, దుగ్గొండిలో 5,430, ఖానాపురంలో 2,740, నల్లబెల్లిలో 4,406, నర్సంపేటలో 5,246, నెక్కొండలో 4,620, గీసుగొండలో 4,648, ఖిలావరంగల్లో 2,464, పర్వతగిరిలో 4,328, రాయపర్తిలో 5,100, సంగెంలో 5,240, వరంగల్లో 988, వర్ధన్నపేటలో 4,205 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందింది. అదునులో ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి అందజేస్తుండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం కనపడింది. బుధవారం రెండు ఎకరాలు, గురువారం మూడు ఎకరాలలోపు విస్తీర్ణం గల రైతులకు ఇలా కొద్ది రోజుల్లో రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందనుంది.