వరంగల్ రూరల్ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో అర్హులైన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం రూ.91.10 లక్షలను పంపిణీ చేశారు. మొత్తం 91 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే ఈ సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా 17 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.4.45 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలు 200 మందికి ఎమ్మెల్యే వస్త్రాలు బహుకరించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడపిల్లలు బాధపడే రోజులు పోయాయన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పేద ప్రజలకు సహాయపడటానికి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలోనే యువతుల వివాహానికి రూ. లక్ష అందించే ఏకైక టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.