అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి
ములుగు మండలం జాకారంలో నర్సరీ పరిశీలన
మొక్కల సంరక్షణకు చేపడుతున్న చర్యలపై ఆరా
వెంకటాపూర్, జూలై 7 : రామప్ప ఆలయంలోని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయ ని అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి అన్నారు. గురువారం ఆమె కలెక్టర్ కృష్ణఆదిత్య, సీసీఎఫ్ ఆశతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. శాంతకుమారికి ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ స్వాగతం పలికి రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మండపంలో శాలువాతో సన్మానించారు. ఆలయ విశిష్టతను టూరి జం గైడ్ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యంత్రాలతో చేయలేని శిల్పాలను చేతి పరికరాలతో చేయడం అద్భుతమన్నారు. కలెక్టర్ కృష్ణఆదిత్య ఆమెకు జ్ఞాపిక అందజేశారు.
జాకారం నర్సరీ సందర్శన
ములుగు రూరల్, జూలై 7 : ములుగు మండలంలోని జాకారంలో ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని అ టవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతాకుమా రి గురువారం సందర్శించారు. నర్సరీలోని టాల్ ప్లాంట్, రేసింగ్ ప్లాంట్, ప్రైమరీ బెడ్లను పరిశీలించారు. మొక్కల సంరక్షణకు చేపడుతున్న చర్యలను అధికారులను, సి బ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంత రం మొక్కల పెంపకంలో వినియోగిస్తున్న విత్తనాలను పరిశీలించారు. మొక్కల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట ములుగు డీఎఫ్వో ప్రదీప్కుమార్శెట్టి, ము లుగు, ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) ఎఫ్డీవోలు జోగేందర్, ప్రశాంత్పాటిల్, గోపాల్రావు, ములుగు ఎఫ్ఆర్వోలు శంకర్, శ్రావణి, ఎస్సైలు రాధిక, డీటీ మల్లేశ్వర్రావు, ఉన్నారు.