తెలుగు జాతి గౌరవాన్ని చాటిన నర్సింహారావు.. నేడు పీవీ వర్ధంతి
నర్సంపేట రూరల్, డిసెంబర్21: నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో 1921జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ఈయన స్వగ్రామం వంగర. తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మిణి. పీవీ ప్రాథమిక విద్య వంగర, హనుమకొండలో సాగింది. 1936లో మెట్రిక్లేషన్లో ఉత్తీర్ణులయ్యారు. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో 1921జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ఈయన స్వగ్రామం వంగర. తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మిణి. పీవీ ప్రాథమిక విద్య వంగర, హనుమకొండలో సాగింది. 1936లో మెట్రిక్లేషన్లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడంతో ఆయన రాష్ట్రం లో ఎక్కడా చదవకుండా, ప్రభుత్వం నిర్బంధం విధించిం ది. దీంతో ఆయన మహారాష్ట్రలోని పుణెలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆయన హైదరాబాద్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్గా పనిచేశారు.
పీవీ 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1972 వరకు నాలుగుసార్లు మంథని నియోజకవర్గం(కరీంనగర్) నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయశాఖలు నిర్వహించారు. 1971 సెప్టెంబర్లో ముఖ్యమంత్రిగా పనిచేసి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భూసంస్కర ణలను కఠినంగా అమలు చేశారు. 1973-75 మధ్య కాలంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1977లో హన్మకొండ లోక్సభకు ఎన్నికై ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో హోం, విదేశాంగ శాఖల మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత రాజీవ్గాంధీ మంత్రి వర్గంలో హోంశాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అదిష్ఠించారు. ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసి, దేశాన్ని ప్రగతిబాట పట్టించారు. కవి, రచయిత, కథకుడు, అనువాదకుడు, పాత్రికేయుడిగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు వెలకట్టలేనివి. భూస్వామ్య పోకడలకు దూరంగా తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని పేదలకు పంచారు.
2004 డిసెంబర్ 23న పీవీ నర్సింహారావు కన్నుమూయగా, ఆయన అంత్యక్రియలకు ప్రాధాన్యమివ్వడంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కారు పీవీ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించింది. పీవీ జ్ఞాపకార్థం 2018 జూన్ లో పీవీ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని ఏర్పాటు చేశారు. లక్నేపల్లిలో నేడు పీవీ వర్ధంతిని ఘనంగా నిర్వహించనున్నారు.