ఖిలావరంగల్, జనవరి 27: తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్ష కట్టాడని, కక్షపూరిత విధానాలు మానుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు టీ శ్రీనివాసరావు హెచ్చరించారు. శివనగర్లోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయాలను బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలించి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో అశాంతిని కలిగిస్తూ హిందూ రాజ్యస్థాపన దిశగా భారత రాజ్యాంగాన్నే మార్చాలనే దుష్ట తలంపుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.