ఖానాపురం, ఏప్రిల్ 8: జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్రమంత్రికి ఉత్తరాలను పోస్ట్ చేసి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పెద్ది ఆదేశాల మేరకు బుధరావుపేటలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు చేపట్టిన పోస్ట్కార్డు ఉద్యమాన్ని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ప్రారంభించి మాట్లాడారు. జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. బడ్జెట్లో కేంద్రం ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధిహామీ పథకానికి రూ. 30 వేల కోట్లు తక్కువగా కేటాయించిందని అన్నారు. దీంతో కూలీలకు పనిదినాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈజీఎస్లో కనీస కూలి రూ. 257 ఇవ్వాల్సి ఉన్నా రూ. 100కు మించి ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. అలాగే, పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరచి ఉపాధి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, ఎంపీటీసీ సుభాన్బీ, మౌలానా, పార్టీ గ్రామ అధ్యక్షుడు యాకూబ్పాషా, రాజశేఖర్, నాగరాజు, మురళి, ఎల్లయ్య పాల్గొన్నారు.
వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
చెన్నారావుపేట: ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పత్తినాయక్ డిమాండ్ చేశారు. పాపాయ్యపేటలో బీఆర్ఎస్ నాయకులు పోస్ట్కార్డుల ద్వారా జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రికి సందేశాన్ని పంపి నిరసన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సర్పంచ్ లక్ష్మీ వెంకటేశ్వర్లు, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురమరి రవి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, క్లస్టర్ ఇన్చార్జి జున్నుతుల రాంరెడ్డి, నాయకులు కృష్ణచైతన్యరెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్గౌడ్, ఉప సర్పంచ్ వెంకన్న, పీఏసీఎస్ డైరెక్టర్ రాంబాబు, నాయకులు భూక్యా బాల్సింగ్, రవీందర్, కట్టయ్య, యాకయ్య, వీరస్వామి, రమేశ్, స్వామి, సారంగం, తిరుపతి పాల్గొన్నారు.
పెద్దకోర్పోలులో ఉత్తర యుద్ధం
నెక్కొండ: ఈజీఎస్ను కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని మండలంలోని పెద్దకోర్పోలు వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రికి లేఖలు పంపించి ఉత్తర యుద్ధాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మహబూబ్ పాషా ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు, గ్రామస్తులు ఉత్తరాలను పోస్టు చేయగా, కార్యక్రమానికి ఎంపీపీ జాటోత్ రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలనే నిబంధనతో కూలీలు పనికి దూరమవుతున్నారని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస కూలి అందడం లేదని, పని ప్రాంతంలో సౌకర్యాలు కల్పించడం లేదని ధ్వజమెత్తారు. ఈజీఎస్ను అనుసంధానం చేసి చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, ఉప సర్పంచ్ పరిపాటి ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ కర్ర సుకన్య, సొసైటీ వైస్ చైర్మన్ మెండె వెంకన్న, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శోభన్, వార్డు సభ్యులు కుమారస్వామి, అనిత సజ్జాన్, ఓదెమ్మ కొమురయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ పొరండ్ల స్వరూప, నాయకులు మెండెవ వీరస్వామి, జంపాల లక్ష్మణ్, మేడి ముత్తయ్య, బిర్రు రాజు, దయ్యాల భిక్షపతి, యాకంత్ పాల్గొన్నారు.
కేంద్రానికి కనువిప్పు కలుగాలి
నర్సంపేటరూరల్: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర యుద్ధంతోనైనా కనువిప్పు కలుగాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు. ఈజీఎస్ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని రాజపల్లిలో ఉత్తర యుద్ధం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. రైతులు పోస్ట్కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని సత్యనారాయణ డిమాండ్ చేశారు. గంటలతరబడి పని చేసినా కూలీలకు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నామాల భాగ్యమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ నర్ర నాగరాజు, రైతులు గుర్రాల రాఘవరెడ్డి, పొన్నం రమేశ్, నూనె కుమారస్వామి, రాధిక, వార్డు సభ్యులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈజీఎస్ను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
నల్లబెల్లి: ఉపాధిహామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్ ధ్వజమెత్తారు. ఈజీఎస్ను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే డిమాండ్తో మూడుచెక్కలపల్లెలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోస్ట్కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా అమలు చేయకుండా కూలీల పొట్టగొట్టేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఉపాధిహామీ కూలీల సమస్య పరిష్కారమయ్యే వరకూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ పూల్సింగ్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెట్టి మురళీధర్రావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొత్తపెల్లి కోటిలింగాచారి, గందె శ్రీనివాస్గుప్తా, క్లస్టర్ ఇన్చార్జిలు హింగ్లె శివాజీ, మోహన్రెడ్డి, నరహరి, నాయకులు, కార్యకర్తలు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.