అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని గోడౌన్లలో ఎలక్షన్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఓట్లను 14 టేబుళ్లపై కౌంటింగ్ చేయనుండగా, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు అదనపు టేబుళ్లు ఏర్పాటు చేశారు. నర్సంపేట నియోజకవర్గానికి 21, వర్ధన్నపేట 20, వరంగల్తూర్పు 17, పశ్చిమ 18, పరకాలకు 17 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంట్ను కేటాయించారు. ఆదివారం ఉదయం 7 గంటల వరకే వీరిని లోపలికి అనుమతించనున్నారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం కానుండగా, కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్ పరిశీలించారు. సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సిబ్బందికి కౌంటింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు.
వరంగల్, డిసెంబర్ 2(నమస్తేతెలంగాణ) : శాసనసభ ఎన్నికల తుదిఘట్టం ఆదివారం జరుగనుంది. ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. ఆయా నియోజకవర్గంలో పోలైన ఓట్లను లెక్కించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ అనంతరం జిల్లాలోని నర్సంపేట, వరంగల్తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఈవీఎంలను ఎన్నికల అధికారులు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ట్రాంగ్ రూములకు తరలించారు. ఈ స్ట్రాంగ్ రూంలకు భారీ పోలీసు భద్రత కల్పించారు. శుక్రవారం కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు షణ్ముగ రాజన్ మూడు నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఈఆర్వో)లతో కలిసి రాజకీయ పార్టీల సమక్షంలో పోలింగ్ నిర్వహించిన ఫామ్ 17-సీ పరిశీలించారు.
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉన్నాయని, స్క్రూటినీ పూర్తయిందన్నారు. ప్రిసైడింగ్ అధికారి, అబ్జర్వర్ సమర్పించిన పోలింగ్ ఓట్ల వివరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య, ఈఆర్వోలతో కలిసి ఫారం 17-సీ ధ్రువీకరణపత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి సీల్ వేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఎనుమాముల మార్కెట్ ఆవరణలోనే నిర్వహించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. మార్కెట్లోని 17/ఏ గోడౌన్లో నర్సంపేట, 17/బి గోడౌన్లో వరంగల్తూర్పు, 17/సీ గోడౌన్లో వర్ధన్నపేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం సుమారు 250 మంది అధికారులు విధులు నిర్వర్తిస్తారని, కౌంటిగ్ జరిగే ప్రతి టేబుల్కు సూక్ష్మ పరిశీలకుడు, సూప ర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. సెక్యూరిటీ పరిశీలన అనంతరం ఉదయం 7 గంటలకు కౌంటింగ్ హాలులోకి అనుమతిస్తామని, అబ్జర్వర్, ఆర్వోలు మినహా ఎవరికీ కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్ అనుమతి ఉండదన్నారు. పెన్ పెన్సిల్ పేపర్ తప్ప ఏమీ సెంటర్లోకి అనుమతించమని ఆమె తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో పోలైన ఓట్లను 14 టేబుళ్లపై లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నర్సంపేట, వరంగల్తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలను అమర్చారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఆయా నియోజకవర్గం కౌంటింగ్ హాలులో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరగనుంది. పోస్టల్ బ్యాలెట్ను లెక్కించేందుకు ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్లకు ఒకటి చొప్పున అదనంగా టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంటు ఉంటారు. వారికి ఆర్వో ద్వారా గుర్తింపు కార్డులను ఎన్నికల అధికారులు అందజేశారు. పోలింగ్ ఏజెంట్లు, సిబ్బంది కోసం వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. నర్సంపేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 21, వర్ధన్నపేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 20, వరంగల్తూర్పు నియోజకవర్గం కౌంటింగ్ 17 రౌండ్లలో జరుగనుందని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. నర్సంపేట నియోజకవర్గం నుంచి 16, వర్ధన్నపేట నుంచి 14, వరంగల్తూర్పు నుంచి 29 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నర్సంపేట, తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. నర్సంపేట నియోజకవర్గంలో 87.87 శాతం పోలింగ్ నమోదైంది. 2,32,179 మంది ఓటర్లలో 2,04,011 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్తూర్పులో 66.74 శాతం పోలింగ్ జరిగింది. 2,54,641 మంది ఓటర్లలో 1,69,935 మంది ఓటు వేశారు. వర్ధన్నపేటలో 80.23 శాతం పోలింగ్ నమోదైంది. 2,69,192 మంది ఓటర్లకు 2,15,986 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు ఈవీఎంల ద్వారా పో లింగ్ జరిగిన నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు ఎ క్కువ సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. తొలి అంచెలో కార్లు, ఇతర వాహనాలు పార్క్ చేయాల్సి ఉంటుంది. రెండో అం చెలో స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ (రాష్ట్ర బలగాలు) ఏర్పాటు చేశారు. ఇక్కడ సెల్ఫోన్ ఉందా లేదా అనేది తనిఖీ జరుగనుంది. తర్వాతే లోపలకు అనుమతిస్తారు. మూడో అంచెలో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ (కేంద్ర బలగాలు) కూడా తనిఖీ చేశాకే లోపలకు అనుమతిస్తారని ప్రావీణ్య తెలిపారు. ఉదయం 6 గంటలకు అబ్జర్వర్, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరువనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందని, తర్వాత తొలి రౌండ్ లెక్కింపు ప్రారంభం కానుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అనంతరం రౌండ్ వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తూ ఫలితాలను ఆర్వో ధ్రువీకరణ (సంతకం) ద్వారా మీడియాకు అందజేస్తామని ప్రకటించారు. ఎనుమాముల మార్కెట్ ఆవరణలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను శనివారం జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య, సాధారణ ఎన్నికల పరిశీలకుడు షణ్ముగరాజన్, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు కృష్ణవేణి, అశ్విని తానాజీ వాకడే, రిజ్వాన్ బాషా పరిశీలించారు. వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
హనుమకొండ : జిల్లాలోని పరకాల నియోజక వ ర్గానికి సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 17 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి సంబంధించి 18 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇ బ్బందులు జరుగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పశ్చిమ నియోజకవర్గానికి గోడౌన్ నంబర్ 4/డీ, పరకాలకు 4/డీ గోడౌన్ను నిర్ణయించారు.
వరంగల్ ఏనుమాములలోని వ్యవసాయ మారెట్ యార్డులో మాక్ కౌంటింగ్ అనంతరం ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెకింపు ప్రారంభమవుతుంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 5,08,124 ఉండన్నారు. పరకాల నియోజకవర్గంలో మొత్తం 2,21,436 ఓటర్లకు 187362 మంది తమ ఓటు హకు వినియోగించుకోగా 84.61 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,86,688 ఉండగా, 162236 మంది ఓటర్లు ఓటు హకును వినియోగించుకోగా 56.59 శాతం పోలింగ్ నమోదైంది. హనుమకొండ జిల్లాలో పోలింగ్ శాతం 68.80 నమోదైంది. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డ్లోని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఓట్ల లెకింపు ప్రక్రియ ఆదివారం ఉదయం ప్రారంభం కానుంది.