గోవిందరావుపేట, మే 27 : క్రీడా మైదానాలను జూన్ 2వ తేదీ లోగా ప్రారంభించాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణఆదిత్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షాకేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మండలకేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షాకేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మండలంలో క్రీడా ప్రాంగణాలన్నీ జూన్ 2లోగా ప్రారంభించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ప్రవీణ్కుమార్, తహసీల్దార్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.