హనుమకొండ/గిర్మాజీపేట, ఆగస్టు 3 : వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు శాసన సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గురువారం పలువురు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రైతు రుణ మాఫీ కార్యక్రమం ప్రారంభించడం వంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు అమలు చేయడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ను కలిసిన వారిలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తదితరులు ఉన్నారు.