గీసుగొండ, నవంబర్ 26 : కాంగ్రెస్ను నమ్మి ఓటెస్తే తెలంగాణ రాష్ట్రం అంధకారమవుతుందని పరకాల అభ్యర్థి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 15,16వ డివిజన్లోని ధర్మారం, రెడ్డిపాలెం, గోపాల్రెడ్డి నగర్, మొగిలిచెర్ల గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే స్థానికులతో ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చి 50 ఏండ్లు కరెంటు రాక కష్టాలు పడ్డామని గుర్తు చేశారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఎలా ఇవ్వగలిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రజలకు మంచి చేయాలనే ఆశయంతో ఉన్న బీఆర్ఎస్పు ప్రజలు ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మితే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఆనాడు లో వోల్టేజీతో మోటర్లు, టాన్స్ఫార్మర్లు కాలిపోయేవన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో వలస పక్షుల్లాగా పరకాలకు వచ్చిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎన్నికయ్యాక ఇక్కడ కనిపించరని చెప్పారు.
గతంలో పరకాల ఎలా ఉండేదో ఇక్కడ పోటీచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలియదా? వారు అభివృద్ధి గురించి మాట్లాడటంం సిగ్గుచేటన్నారు. మొగిలిచెర్ల, గొర్రెకుంట, ధర్మారం గ్రామాల్లో రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడ్డారని, ఇప్పుడు ఇక్కడ అద్దంలాంటి రోడ్లు వేయించానని పేర్కొన్నారు. పరకాలలో జరిగిన అభివృద్ధిపై ఇక్కడ పోటీ చేస్తున్న ప్రతిపక్ష నాయకులు ప్రజలను అడిగి తెలుసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మటం మానేశారని చెప్పారు. ప్రజలను మోసం చేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరెంటు ఇవ్వలేక రైతులను రోడ్ల మీద పడేసిందన్నారు. పరకాలను మరింతా అభివృద్ధి చేసుకుందామని తనను మళ్లీ ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సుంకరి మనీషాశివకుమార్, ఆకులపల్లి మనోహర్, గద్దె బాబు, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు గోదాసి చిన్న, గోలి రాజయ్య, వీరేశం, పిట్ల రాజు, కొమ్ముల కిశోర్కుమార్, గజ్జి రాజు, నాగరాజు, కర్ణాకర్, నవీణ్, ఉజ్వల్కుమార్, శ్రవణ్కుమార్, కిశోర్, రఘు, సతీశ్, చింతం రాజు, సాంబయ్య, నర్సింగరావు, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.