మూడో రోజూ వెలుగులు పంచుతూ కంటి వెలుగు శిబిరాలు కొనసాగాయి. జిల్లాలోని 44 కేంద్రాలకు ప్రజలు వెల్లువలా వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. సోమవారం 2,932 మందికి వైద్యం చేసి, 1906 మందికి కళ్లద్దాలు అందజేశారు. 1026 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం సిఫారసు చేశారు. కళ్లద్దాలు తీసుకున్న వారు అవి పెట్టుకుని మురిసిపోయి చూపు స్పష్టంగా కనిపిస్తున్నదని సంబురపడ్డారు. ఇప్పటి వరకు మొత్తం 13,965 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్ఓ వెంకటరమణ సందర్శించారు. కంటి పరీక్షలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి, సూచనలు, సలహాలు ఇచ్చారు. నిర్ణీత సమయానికి వచ్చి కంటి పరీక్షలు చేసుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు సూచించారు.
– గిర్మాజీపేట, జనవరి 23
కుటుంబ పెద్దగ ఆలోచిత్తాండు..
వర్ధన్నపేట: కుటుంబ పెద్దగ సీఎం కేసీఆర్ సారు ఆలోచిత్తాండు. అన్నిటికి ఆసరైతాండు. ప్రతి నెల రూ. 2వేల పింఛన్ ఇచ్చుడుతో ఖర్చులు ఎల్లుతానై. ఇప్పుడు కంటి సూపు సక్కగ కనబడక ఇబ్బందిగ ఉన్నది. నా కొడుకులు పనిచేసుకుంటెనే బతుకుతరు. నన్ను దవాఖానకు తోల్కపోయేందుకు వాళ్లకు కట్టమై తది. సీఎం సారు మా వాడల్నె కంటి పరీక్షలు చేయిత్తాండు. అద్దాలు కూడా ఇచ్చిర్రు. అవి పెట్టుకొని సూత్తె దూరం, దగ్గరి వస్తువులు కనిపిత్తానై. ఆ సారు మాకు దేవుని లెక్క ఉన్నడు. ఆయనను సల్లంగ ఉండాలె.
– మల్లెపాక వరమ్మ, వర్ధన్నపేట
గిర్మాజీపేట, జనవరి 23: ‘కంటివెలుగు’ శిబిరాలు మూడో రోజూ జోరుగా కొనసాగాయి. పరీక్షలు చేయిం చుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా రావడంతో సోమ వారం శిబిరాలు కిటకిటలాడాయి. జిల్లాలో సోమవా రం కంటి వెలుగు కార్యక్రమంలో 2,932 మందికి పరీ క్షలు నిర్వహించారు. అందులో 1906 మందికి కళ్లద్దా లు అందజేశారు. 1026 మంది కి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేశారు. పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగ ల్, చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహె చ్వో కాజీపేట వెంకటరమణ సందర్శించారు.
జిల్లాలో 44 కంటివెలుగు శిబిరాల్లో ఇప్పటి వరకు 13,965 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో తెలిపారు. కంటివెలుగు కేంద్రాలు ప్రతి రోజూ ఉద యం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహి స్తున్నామని పేర్కొన్నారు. సెంటర్లలో ఏమైనా సమ స్య లు ఉంటే జిల్లా కంటివెలుగు ఎమర్జెన్సీ మానిటరింగ్ సెల్ నుంచి పరిష్కస్తున్నట్లు తెలిపారు. ప్రజలు స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి కంటివెలుగు ప్రోగాంలో పాల్గొనాలన్నారు. సోమవారం ఆయా కేంద్రాల్లో కంటి పరీక్షలు ఎంత మంది చేసుకున్నారనే వివరాలను జిల్లా కంటివెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు తెలిపారు.
నర్సంపేట వార్డు 21లో 109 మంది, రా యపర్తిలో 92, జల్లిలో 104, వరంగల్ 12వ వార్డు దేశాయిపేటలో 117, 22వ వార్డు దేశాయిపేటలో 93, 35వ వార్డులో 73, 39వ వార్డు ఫోర్ట్ వరంగల్లో 74, చింతల్లో 96, 21వార్డులో 83, 26వ వార్డులో 31, 36వ వార్డులో 12, 15వ వార్డు గీసుగొండలో 76, 16వ వార్డు కీర్తినగర్లో 38, 17వ వార్డు పైడి పల్లిలో 28, 19వ వార్డు కాశీబుగ్గలో 80, 39వ వార్డు ఎస్ఆ ర్ఆర్ తోటలో 84, 32వ వార్డులో 73, 37వ వార్డు ఫోర్ట్వరంగల్లో 32, 3వ వార్డు పైడిపల్లిలో 86, 42వ వార్డు రంగశాయి పేటలో 64, 41వ వార్డులో 16, ఉప్పరపల్లిలో 105, ఖానాపూర్ లో 95, దీక్షకుం టలో 80, నెక్కొండ లో 84, నల్లబెల్లిలో 75 , పర్వత గిరిలో 76, బానోజీపేటలో 50, వర్ధన్నపేట వార్డు-3(రాయపర్తి)లో 53, లక్ష్మీపూర్లో 86, అలంకానిపే టలో 59, దుగ్గొండిలో 57, చింతనెక్కొండలో 68, కొంకపాకలో 65, సంగెంలో 56, చెన్నారంలో 61, ఇటు కాలపల్లిలో 39, చెన్నారావుపేటలో 37, గీసు గొండలో 35, తిరుమలాయపల్లిలో 35, ఊకల్లో 33, గవిచర్ల లో 31, వంచనగిరిలో 31, మేడెపల్లిలో 28, ధర్మారావుపేటలో ముగ్గురికి కంటిపరీక్షలు నిర్వ హించినట్లు తెలిపారు.
ప్రజలందరూ విధిగా శిబిరాలకు నిర్ణీత సమయానికి వచ్చి కంటిపరీక్షలు చేసుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు కోరారు.