పాలకుర్తి, ఆగస్టు 18: టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని పంచాయతీరాజ్శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలం లో చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో మంత్రి నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. బండెపాక నాగన్న, బండెపాక సోమ య్య ఆధ్వర్యంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ ఆదేశాలు పాటిస్తూ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులకు ఆకర్షితులమై టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. పార్టీలో చేరిన వారిలో బన్నెపాక పరశురాములు, జలగం కనకరాజు, దుప్పెల్లి శ్రీకర్, దుప్పెల్లి రామ్ముర్తి, ఎముడాల వేణు, వనగండ్ల నాగన్న, బన్నెపాక సైదులు, బన్నెపాక చిన్న యాకయ్య, బన్నెపాక ప్రశాంత్, బన్నెపాక విజయ్కుమార్, రవి, వల్లూరి రవి, రాజు, శ్రీను ఉన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఏసీఎస్ వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, సర్పంచ్ పార్వతీరాజేశ్వర్రావు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎండీ నాజర్, ఎంపీటీసీ పుస్కూరి కళింగరావు, ఉపసర్పంచ్ ఆకారపు ఉపేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.