దామెర, జూన్ 9 : ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూరాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దామెర మండల కేంద్రంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్లో శుక్రవారం జరిగిన పరకాల నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ సంక్షేమ పథకాల సంబురాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండో విడుతగా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం కులవృత్తిదారులు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం, కంటి వెలుగుతో పేద ప్రజలకు కంటి అద్దాలు, ఉచితంగా ఆపరేషన్లు చేయించామన్నారు.
నియోజకవర్గంలో ఆరు రెసిడెన్షియల్ పాఠశాలలు, ఒక పాలిటెక్నిక్ కళాశాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, ప్రతి చెరువును నీటితో నింపడంతో పాడిపంటలు సంవృద్ధిగా పండుతున్నాయన్నారు. రూ.43వేల కోట్లను వెచ్చించి మిషన్భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ డీఫ్లోరైడ్ నీటిని అందించిన ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. ఇండ్లు లేని 1300 మంది నిరుపేదలకు డబుల్బెడ్ రూం ఇండ్లు ఇచ్చామన్నారు. ఇండ్ల స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.3లక్షలను సైతం ప్రభుత్వం ఇస్తుందన్నారు. మహిళలకు రుణాలు ఇస్తున్నామని, కులవృత్తిదారులు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుంటే తక్షణం రూ.లక్ష అందజేస్తామన్నారు. దళిత బంధును ప్రవేశపెట్టి దళితుల ఆర్థికాభివృద్ధికి రూ.10లక్షలు ఇచ్చి దేశం గర్వించేలా వారికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు.
ఐటీ రంగంలో తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ ఎన్నో వేల కోట్ల రూపాయల పెట్టుబడులను మన రాష్ర్టానికి తీసుకువచ్చారన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. మరోసారి సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సిగ్ధా శుక్ల, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, దామెర, సంగెం, నడికూడ, ఆత్మకూరు, ఎంపీపీలు కాగితాల శంకర్, కందగట్ల కళావతి, మచ్చ అనసూయ, మార్క సుమలత, జడ్పీటీసీలు గరిగె కల్పన, కక్కెర్ల రాధిక, సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత, పోలీసు ధర్మారావు, పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనితారామకృష్ణ, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇన్చార్జి ఆర్డీవో ఉమరాణి, తహసీల్దార్ రియాజొద్దీన్, ఎంపీడీవోలు కాసర్ల రవీందర్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, గండు రామకృష్ణ పాల్గొన్నారు.