పదో రోజు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
వాడవాడలా పారిశుధ్య పనులు
సమస్యలు గుర్తించి సత్వరం పరిష్కరించి..
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
స్వచ్ఛందంగా పాల్గొంటున్న ప్రజలు
ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పదో రోజు జోరుగా కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులు చేయించారు. పారపట్టి.. రోడ్లను ఊడ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేయడంతో పాటు రోడ్లకు ఇరువైపులా చెత్త, ముళ్లపొదలను తొలగించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించి, వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించారు. నర్సరీలను పరిశీలించి హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలని అవగాహన కల్పించారు.
పెద్దవంగర: పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పను లు జరుగుతున్నాయని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో కొనసాగుతున్న పనులనను ఆమె పరిశీలించి మాట్లాడారు. యువత పల్లెప్రగతిలో స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఉప్పరగూడెం గ్రామంలో గ్రంథాలయ భవన నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, ఎంపీవో యాకయ్య, పంచాయతీ కార్యదర్శి హేమలత, టీఆర్ఎస్ నాయకులు సమ్మ య్య, సోమయ్య, ఎండీ శరబొద్దీన్, వేముల రఘు, శ్రీనివాస్, వేణు, సౌమ సతీశ్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
చిన్నగూడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలించారు. ఉగ్గంపల్లి, జయ్యారం, గుండరాజుపల్లి, విస్సంపల్లి, చిన్నగూడూరు తదితర గ్రామాల్లో పంచాయతీ సి బ్బంది పారిశుధ్య పనులతో పాటు హరితహారం మొక్కలకు ట్రాక్టర్ ద్వారా నీరందిస్తున్నారు. తాగునీరు, అంతర్గతరోడ్లు, మురుగునీటి నిల్వ లు, విద్యుత్ తదితర సమస్యలు తలెత్తకుండా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చర్యలు చేపడుతున్నట్లు సర్పంచులు మల్లయ్య, నవీన్తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు సరస్వతి, చెవుల రాధా, పూలమ్మ తదితరులు ఉన్నారు.
దంతాలపల్లి: మండలంలోని జీపీ పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెబాట పడుతున్నారు. అదివారం గ్రామంలో పరిశుధ్య పనులు నిర్వహించి వీధులను శుభ్రం చేశారు. ప్రజలు పల్లె ప్రగతిలో స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. కుమ్మరికుంట్ల, తూర్పుతండా, రేపోణి గ్రామాల్లో ఎంపీడీవో గోవిందరావు, ఎంపీవో అఫ్సర్పాషా పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి
గార్ల: పట్టణ ప్రజలు ఇంకుడు గుంతలను నిర్మించుకుని భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ అన్నారు. ఆదివారం పల్లె ప్రగతిలో భాగంగా మండల కేంద్రంలోని పుట్టకోట, బజారురోడ్డు, రాములు ఇంటి ఎదుట ఇంకుడు గుంటను ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అంబేద్కర్ నగర్, మసీద్ సెంటర్, దంపకం బజార్, మెయిన్ బజార్లో సైడ్ కాల్వల్లో పూడికతీసి, రోడ్డుపై చెత్తను శుభ్రం చేశారు. గార్ల నుంచి సత్యనారాయణపురం వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లకు ట్యాంకర్ల ద్వారా నీరు పోశారు. కార్యక్రమంలో ఎంపీవో కుమారస్వామి, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, కిశోర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో తండాలు
నర్సింహులపేట: పల్లె ప్రగతి పనులతో గ్రామాలతో పాటు తండాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి అన్నా రు. ఆదివారం మండలంలోని రూప్లాతండా, బక్కతండా, కౌసల్యదేవిపల్లి జీపీ పరిధిలో పారిశుధ్య పనులను పరిశీలించి మాట్లాడారు. హరితహారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయాలని, మురుగు నీరు రోడ్లపైకి రాకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సోంలాల్, సర్పంచ్ లక్ష్మి, లక్ష్మణ్, ఏపీవో భూపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.