పర్వతగిరి, నవంబర్ 1 : పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు ముమ్మరంగా సాగుతున్నాయి. నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం కింది తండాకు చెందిన బంజారా నాయకులు 10 మంది, లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు సమ్మన్న, సోమయ్య, యాదగిరి తదితరులు, తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, తొర్రూరు మున్సిపాలిటీ ఐదో వార్డు దుబ్బ తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు భూక్యా మోహన్, సీతారాం ఆధ్వర్యంలో 10 మంది, ఆరో వార్డుకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు భూక్యా దినేశ్ ఆధ్వర్యంలో 10 మంది, మహిళా లీడర్లు భూక్యా బన్నీ ఆధ్వర్యంలో 10 మంది, పాలకుర్తి మండలం పెద్ద తండాకు చెందిన ధరావత్ ప్రవీణ్, శ్రీను, రవి, రాములు, రాజు, రవి, లావుడ్యా కిషన్, వాలు, జుబీలాల్, నరేశ్, కిషన్, సురేశ్, యాకూబ్, నవీన్, రాయపర్తి మండలం కొలన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వద్దిరాజ్ బాలరాజు, వద్ది ఉమా, వద్ది కవిత, వద్ది చందు తదితరులు పర్వతగిరిలోని మంత్రి స్వగృహంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వీరికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం పని చేయాలని కోరారు. ఎన్నికల తర్వాత వారి వారి గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం ఊకల్, బీల్ నాయక్ తండా, బాలాజీ తండా, మహబూబ్నగర్, గణేశ్కుంట తండా, రాగన్నగూడెం గ్రామాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో సమన్వయంతో కలిసి పని చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరికీ వివరించి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని కోరారు. బీఆర్ఎస్ విజయానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.