గోవిందరావుపేట, ఫిబ్రవరి 19 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పగిడిద్దరాజు రానున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్ల నుంచి మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి సుమారు 35 కిలోమీటర్ల దట్టమైన అడవిలో పగిడిద్దరాజును పెనక వంశీయులు తీసుకురావడం ఆనవాయితీ.
ఈ సారి లక్ష్మీపురం గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన షెడ్లో మంగళవారం రాత్రి పగిడిద్దరాజు బస చేయనున్నారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి పస్రా మీదుగా మేడారానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పెనక వంశీయులతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.