పాలకుర్తి, జనవరి 20 : ఆధ్యాత్మిక క్షేత్రంగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం క్షీరగిరి క్షేత్రంపైనున్న మహా మండపంలో ఘనంగా జరిగింది. దేవస్థాన చైర్మన్గా వెనుకదాసుల రామచంద్రయ్యశర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
స్వామివారిని ఎర్రబెల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారోత్సవం అనంతరం మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. ప్రాచీన చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో యాదాద్రి ఆలయంతోపాటు పాలకుర్తిలోని సోమేశ్వరాలయం అభివృద్ధికి పెద్దఎత్తున నిధు లు మంజూరు చేశారని తెలిపారు. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, వాల్మీకి జన్మస్థలమైన వల్మిడిలోని టూరిజం పనులకు రూ.62.50కోట్లు వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. కాకతీయ కాలం నాటి ఆలయాల పునరుద్ధరణ , జీర్ణోద్ధరణ జరుగుతున్నదన్నారు. సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరి (విష్ణువు)హరులు (శంకరుడు)వేర్వేరుగా ఒకేచోట వెలిసిన ఆలయం దేశంలో ఎక్కడా లేదని ఆయన చెప్పారు.
స్వరాష్ట్రంలోనే ఆలయాల అభివృద్ధి
ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో నిర్వహించిన సమయంలో ఆ ప్రాంగణానికి మహాకవి బమ్మె ర పోతన పేరుపెట్టి గౌరవించిన సీఎం కేసీఆర్ పాలకుర్తి, బమ్మెర ,వల్మిడి ప్రాంతాలను టూరిజం కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. స్వరాష్ట్రంలోనే ఆలయాలు అభివృధ్ది చెందుతున్నాయన్నారు. కొద్ది రోజుల్లో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయన్నారు.పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రా మంలోని దేవాలయాన్ని ఆధునీకరించే పనులు చేపట్టామని ఎర్రబెల్లి తెలిపారు. సోమేశ్వరాలయంలో కల్యాణ మండపం, గోశాల, స్వాగత తోరణాలు, సప్తద్వార స్తంభాలు, గర్భగుడి మెట్లతోపాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సోమనాథ విగ్రహ ప్రతిష్ఠాపన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రూ.25 కోట్లతో హరిత హోటల్ నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామని, మహాశివరాత్రి రోజున మంత్రులు కేటీఆర్ లేదా హరీశ్రావుతో శంకుస్థాపన చేయిస్తామన్నారు.
సోమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి
పండితుడు వెనుకదాసుల రామచంద్రయ్యశర్మకు మరోసారి దేవస్థాన చైర్మన్గా అవకాశం వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో చైర్మన్తోపాటు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి ,డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్రెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, దేవస్థాన ఈవో నండూరి రజినీ కుమారి, సర్పంచ్ల ఫోరం పాలకుర్తి, కొడకండ్ల మండలాల అధ్యక్షులు వీరమనేని యాకాంతారావు, పస్నూరి మధుసూదన్, బీఆర్ఎస్ పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల అధ్యక్షులు పస్నూరి నవీన్కుమార్, సిం టదే రామోజీ, తీగల దయాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్, తహసీల్దార్ భూక్యా పాల్సింగ్, ఎంపీడీవో అశోక్కుమార్, నాయకులు గాంధీనాయక్, ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్ అందె యాకయ్య పాల్గొన్నారు.
దేవస్థాన చైర్మన్గా రామచంద్రయ్య శర్మ
సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థాన చైర్మన్గా వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ధర్మకర్తలుగా కోడూరు నర్సింహారెడ్డి, చాలువాడి సత్యనారాయణ, బజ్జూరి వేణుగోపాల్, కోటగిరి కుమారస్వామి, తీగల సత్తయ్య, కర్నె రమేశ్, కలుసాని ఉప్పల్రెడ్డి, భాస్కర్రెడ్డి, యాకూబ్నాయక్, దౌపాటి నర్సయ్య, చిదురాల సం ధ్యారాణి, చిక్కుడు రాములు ,ఎక్స్ అఫీషియో సభ్యుడిగా దేవగిరి రామన్నశర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నూతన ధర్మకర్తల మండలికి శుభాంక్షాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సునీత, ఇన్స్పెక్టర్ కవిత, పాలకుర్తి ఆలయ ఈవో రజనీ కుమారి పాల్గొన్నారు.