హనుమకొండ, సెప్టెంబర్ 11: మన గ్రామాల్లో ప్రగతి పరిఢవిల్లుతున్నదని, ‘పల్లెప్రగతి’ కార్యక్రమం దేశానికే ఆదర్శమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హనుమకొండ జడ్పీ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల పంచాయతీ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీరింగ్ టెరిటోరియల్ అండ్ సూపరింటెండెంట్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసమే పీఆర్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరించామని, కొత్తగా 740 మందికి ఉద్యోగావకాశాలతో పాటు పలువురికి పదోన్నతులు లభించాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని కార్యాలయాలను ప్రారంభించామని చెప్పారు. ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదన్నారు. ప్రభుత్వ అధికారులు నిబద్ధతతో పని చేసి సర్కారుకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
మన పల్లెలు ప్రగతి గీతికలని, పల్లెప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల పంచాయతీ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీరింగ్ టెరిటోలియల్ అండ్ సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసమే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరించినట్లు తెలిపారు. దీంతో కొత్తగా 740 మందికి ఉద్యోగావకాశాలు, అనేక మందికి ఉద్యోగోన్నతులు వచ్చాయన్నారు. కొత్త ఉద్యోగాలను సైతం ప్రభుత్వం మంజూరు చేసిందని, వాటిని త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కొత్త కార్యాలయాల ప్రారంభోత్సవం పూర్తయిందన్న మంత్రి అధికారులు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 కొత్త కార్యాలయాల్లో సీఈ, సరిల్, డివిజన్, సబ్ డివిజన్ అధికారులు బాధ్యతలు చేపట్టారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 237 ఇంజినీరింగ్ కార్యాలయాలు ఉండగా మిషన్ భగీరథతో పాటు పల్లెప్రగతి ఇతర కార్యక్రమాల ద్వారా పంచాయతీ రాజ్ కార్యకలాపాలు విస్తరించడంతో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలంగాణలోనే పల్లెప్రగతి కార్యక్రమం అమలవుతుందన్నా రు. అలాగే, ఉపాధి హామీ పథకంలో సైతం మనమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
కొత్త కార్యాలయాలు
కొత్తగా 4 చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు, 12 కొత్త సరిళ్లు(8 పీఆర్, 4 క్యూ అండ్ సీ ), 11 డివిజన్లు(7 పీఆర్, 4 క్యూ అండ్ సీ), 60 కొత్త సబ్ డివిజన్లు (37 పీఆర్, 23 క్యూ అండ్ సీ) ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇవన్నీ అందుబాటులోకి వచ్చాయని మంత్రి దయాకర్రావు తెలిపారు. మంచిర్యాల, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వనపర్తి, సూర్యాపేట, నిర్మల్, హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్లో సరిల్ కార్యాలయాలు.. గజ్వేల్, తాండూరు, ఇబ్రహీంపట్నం, హనుమకొండ, భూపాలపల్లి, దేవరకొండ, కోదాడ, కరీంనగర్, మేడ్చ ల్, ఖమ్మం, నల్గొండలో డివిజన్ కార్యాలయాలు ప్రారంభమైనట్లు వివరించారు.
పీఆర్ శాఖ పనితీరు అద్భుతం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ అద్భుతంగా పని చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఈ శాఖ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందన్నారు. దీని అద్భుత పనితీరువల్ల అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయని అరూరి పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తాపట్నాయక్, పీఆర్ ఇంజినీరింగ్ విభాగం సీఈ సీతారాములు, పంచాయతీరాజ్ ఎస్ఈ రఘువీర రెడ్డి, ఈఈ శంకరయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో పలువురి చేరికలు
పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, స్వర్ణకారులు బీఆర్ఎస్లో చేరారు. హనుమకొండ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని 65 మంది స్వర్ణకారులు బీఆర్ఎస్ నాయకులు రామసహాయం కృష్ణకిశోర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కూడా బీఆర్ఎస్లో చేరారు. అలాగే, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చైర్మన్, పెద్ద వంగర మండలం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ ఆధ్వర్యంలో పెద్ద వంగరకు చెందిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎస్కే ఫరీద్, ఎస్కే జాఫర్ కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నియోజక వర్గంలోని పెద్దవంగర మండలం రాజా మాన్సింగ్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ వార్డు సభ్యులు గుగులోత్ రవి, బూడిద మల్లేశ్ పలువురు బీఆర్ఎస్లో చేరగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.