వరంగల్ చౌరస్తా, జనవరి 20 : కరోనా కట్టడిలో భాగంగా నేటి నుంచి ఇంటింటా ఫీవర్ సర్వే ప్రారం భం కానున్నది. వైరస్ లక్షణాలను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఈ సర్వే చేపట్టింది. గతంలో మొదటి, రెండు విడుత వ్యాప్తి సమయాల్లో చేసిన సర్వే, హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావే శమై.. సర్వే ద్వారా కరోనాను తక్కువ స్థాయిలోనే గు ర్తించి, ఎలాంటి ప్రాణనష్టం కలుగకముందే అరిక ట్టడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో జిల్లా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు శుక్రవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని డివిజ న్లు, మండలాలు, గ్రామాల పరిధిలోని సుమారు 2 లక్షల 11వేల 173 ఇళ్లలో సర్వే చేసేందుకు సిద్ధమ య్యారు. ఇందుకోసం అవసరమైన టెస్టింగ్ కిట్లు, ఐసొలేషన్ కిట్లను అందుబాటులో ఉంచారు. ఈ సర్వే ను విజయవంతం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ సిబ్బందితోపాటు ఆశ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలను వినియోగించుకోనున్నారు.
గుర్తించిన వెంటనే మందుల పంపిణీ
పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ నిర్వహించే ఈ సర్వేలో ఇద్దరు ఆశా వర్కర్లతో పాటుగా ఒక ఆరోగ్య కార్యకర్త ఉంటారు. ముందుగా ఇంటిలో ఉన్న కుటుంబసభ్యుల సంఖ్య, వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యతో పాటు పూర్తి వివరాలు నమోదు చేసు కుంటారు. వారిలో వృద్ధులు, అనుమానితులు, లక్ష ణాలున్న వారిని గుర్తించి వారికి ర్యాపిడ్ టెస్టులు చేస్తా రు. ఈ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి ఐదు రోజులకు సరిపడా మందులు ఇస్తారు. ఈ కిట్ లో అజిత్రోమైసిన్, జింకోవిట్, పారాసిటమాల్, రాని టిడైన్ ఉంటాయి. అలాగే వారు తీసుకోవాల్సిన జాగ్ర త్తలను సూచించి, వారి పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకుంటారు. ఐదు రోజుల తరువాత వారి ఆరోగ్య పరిస్థితిని ఫోన్ ద్వారా తెలుసుకొని, అవసరమైతే అద నపు వైద్య సౌకర్యాలు కల్పించడం లేదా హాస్పిటల్కి తరలిస్తారు. ఈ విధానం వల్ల ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిపై పర్యవేక్షించే ఆస్కారం ఉంటుంది.
సర్వేకు సిద్ధంగా ఉన్నాం
జిల్లావ్యాప్తంగా సుమా రు 2లక్షల 11 వేల 173 ఇండ్లలో సర్వే చేసేందుకు సరిపడా టెస్టింగ్ కిట్లు, అవసరమైన ఐసొలేషన్ కిట్లు సిద్ధం చేస్తున్నాం. తక్కువ ప్రభావం ఉన్న సమయంలోనే సర్వే చేయడం వల్లే గతంలో నివా రణ సులభమైంది. కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందు తున్న ఈ వేరియంట్ని సైతం సమర్థవంతంగా ఎదుర్కోవ డానికి మరోమారు సర్వే నిర్వహించా లని ఉన్నతాధికారులు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాం. సర్వేను విజయవం తం చేసేందుకు పక్కా కార్యాచరణతో ఉన్నాం.