నర్సంపేటరూరల్, ఏప్రిల్ 15: కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మండలంలోని రాజుపేట, ముత్తోజిపేటలో ఉత్తర యుద్ధం కార్యక్రమాలను రైతులు, కూలీలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పార్టీలకతీతంగా నిర్వహించారు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొని కేంద్రమంత్రికి ఉత్తరాలు పోస్టు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రామస్వామీనాయక్ మాట్లాడుతూ కేంద్రం ఈజీఎస్ను నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉపాధి పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని గత అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తీర్మానం చేసినా మోదీ సర్కారు ఆ దిశగా అడుగులు వేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్లు బానోత్ దస్రూ, గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ భూక్యా వీరన్న, మండల నాయకులు తాళ్లపెల్లి రాంప్రసాద్, రాయిశెట్టి బుచ్చయ్య, పోశాల లక్ష్మీనారాయణ, క్లస్టర్ ఇన్చార్జిలు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్రెడ్డి, నాయకులు రమేశ్, రాజు, రవికుమార్, కోతి చలం పాల్గొన్నారు.
దుగ్గొండి: ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా ఉత్తర యుద్ధాన్ని ముమ్మరం చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండలంలోని మందపల్లి, పీజీతండా, చాపలబండలో ఉత్తర యుద్ధం కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఉత్తరాలను పోస్ట్ చేశారు. కేంద్రం విధానాలతో రైతులు, ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, సర్పంచ్లు ఏడెల్లి రజితా ఉమేశ్రెడ్డి, మొగ్గం మహేందర్, నునావత్ మంగమ్మ, ఎంపీటీసీ పిండి కుమారస్వామి, నాయకులు కంచరకుంట్ల శ్రీనివాస్రెడ్డి, గుడిపెల్లి మల్లారెడ్డి, ముత్యాల స్వామి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలనే డిమాండ్కు రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతున్నదని అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి అన్నారు. మండలంలోని అమీనాబాద్, పత్తినాయక్తండాలో ప్రజలు క్యూ కట్టి ఉత్తరాలను పోస్ట్ చేశారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి కేతిడి వీరారెడ్డి, ఎంపీటీసీ కడారి సునీతా సాయిలు, ఆర్బీఎస్ గ్రామ కన్వీనర్ అమ్మ రాజేశ్, సర్పంచ్ జాటోత్ స్వామి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ధరావత్ రాములు, బీరయ్య, నాయకులు నరేశ్, తిరుపతి, చిన్న సాంబయ్య, రాజు, శీలం శంకర్, హరిలాల్ పాల్గొన్నారు.