గిర్మాజీపేట, ఏప్రిల్ 12: గర్భిణులకు నార్మల్ డెలివరీలే మేలు అని, శస్త్రచికిత్సలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కాజీపేట వెంకటరమణ అన్నారు. ఆయన మంగళవారం ప్రసవాలపై ఓరియంటేషన్, శస్త్రచికిత్సల ఆడిట్పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో సాధారణ ప్రసవాలు, శస్త్రచికిత్సతో కూడిన ప్రసవాల గణాంకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శస్త్రచికిత్సతో కూడిన ప్రసవాలు ఎందుకు పెరుగుతున్నాయో ఆరా తీశారు. వాటి సంఖ్య తగ్గించాల్సిన బాధ్యతా అధికారులపై ఉందని, ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు.
డిప్యూటీ డీఎంహెచ్వో గోపాల్రావు మాట్లాడుతూ వైద్యసిబ్బంది మానవతాధృక్పథంతో ఆలోచించి శస్త్రచికిత్సతో కూడిన ప్రసవాలను తగ్గించి ఆదర్శ జిల్లాగా మార్చాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ పద్మశ్రీ మాట్లాడుతూ శస్త్రచికిత్సతో ప్రసవాలు చేసి వైద్యవృత్తికి కలంకం తేవద్దని, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో శస్త్రచికిత్సలతో కూడిన ప్రసవాలను ఆడిట్ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీకేఎం సూపరింటెండెంట్ నిర్మల, నర్సంపేట, వర్ధన్నపేట సీహెచ్సీల సూపరింటెండెంట్లు గోపాల్, నర్సింహాస్వామి, ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు, డిప్యూటీ డీఎంవో అనిల్కుమార్, సీసీ రామలింగయ్య పాల్గొన్నారు.