ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ (BRS NRIs ) సోషల్ మీడియా వేదిక ద్వారా ఎండగట్టాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ( Mahesh Bigala ) పిలుపునిచ్చారు. లండన్కు వచ్చిన సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సర్( SIR ) కార్యక్రమం , రానున్న రోజుల్లో జరగనున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎన్ఆర్ఐ శాఖల బలోపేతం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, సత్య మూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, ఐటీ, మీడియా కార్యదర్శి పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం ఉన్నారు.