చెన్నారావుపేట, మార్చి 14 : మహిళలను అందరూ గౌరవించాలని నర్సంపేట ఎమెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం చెన్నారావుపేట నుంచి ఉప్పరపల్లి వరకు రూ.6.50 కోట్లతో నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్డు, అలాగే గ్రామంలో రూ.1.50 కోట్లతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో రూ.20 లక్షలతో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతి అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని మహిళా సమైక్య భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేసీఆర్ మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడం కోసం గ్రామాల్లో సబ్ హెల్త్ సెంటర్లను నిర్మించారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జడ్పీటీసీ పత్తినాయక్, వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్లు ముద్దసాని సత్యనారాయణ, మురహరి రవికుమార్, వైస్ చైర్మన్ చింతకింది వంశీ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సర్పంచ్లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్, క్లస్టర్ బాధ్యుడు చెన్నారెడ్డి, అడిషనల్ డీఎంహెచ్వో ప్రకాశ్, మండల వైద్యాధికారి సరోజ పాల్గొన్నారు.
అభివృద్ధిలో స్పష్టమైన మార్పు..
నెక్కొండ : నియోజకవర్గంలోని పల్లెలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో స్పష్టమైన మార్పు కనబడుతోందని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డివిజన్ లెవల్ క్రీడోత్సవాల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివన్నారు. మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాలాలన్నారు. ఉహించిన దానికంటే ఎక్కువ మంది మహిళలు క్రీడాస్ఫూర్తిని చాటారని, పాల్గొన్న ప్రతి మహిళకూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా 1500 మంది మహిళలకు బహుమతులను అందజేశారు. అనంతరం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజాహరికిషన్, సొసైటీ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, మండల సమాఖ్య అధ్యక్షుతరాలు మార్త లావణ్య, ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, సొసైటీ మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, కట్కూరి నరేందర్రెడ్డి పాల్గొన్నారు.