చెన్నారావుపేట, జూన్ 30: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ జక్క అశోక్ ఆధ్వర్యంలో లింగగిరి గ్రామానికి సర్పంచ్ మాదారపు భాస్కర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పెద్ది సర్పంచ్ మాదారపు భాస్కర్, అతడి అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటివారని, బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తనూ కంటికిరెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, జడ్పీ కోప్షన్ సభ్యుడు రఫీ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, సర్పంచ్లు కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, శ్రీధర్రెడ్డి, ఎంపీటీసీలు, క్లస్టర్ బాధ్యులు పాల్గొన్నారు.
దుగ్గొండి: పార్టీ బలోపేతం కోసం పాటుపడే ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై తిమ్మంపేటకు చెందిన మాజీ వైస్ ఎంపీపీ కొక్కుల విజయ-మొగిలి దంపతులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని పెద్ది కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, సర్పంచ్ మోడెం విద్యాసాగర్గౌడ్, పార్టీ తిమ్మంపేట గ్రామ అధ్యక్షుడు దోనపాటి జనార్దన్రెడ్డి, మండల నాయకుడు ముదరుకోళ్ల కృష్ణ, ఉపసర్పంచ్ కత్తి యాకాంబ్రం, వార్డు సభ్యులు తెప్ప శంకర్, బీరం ప్రభాకర్రెడ్డి, గోళ్లెన ఐలయ్య, మామునూరి విఘ్నేశ్, కడారి రాజు, రాములు, ముదరుకోళ్ల కృష్ణ పాల్గొన్నారు.