ఏటూరునాగారం : ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడమే ఐటీడీఏ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మండల కేంద్రంలోని యూత్ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహిళా వ్యాపారులు, స్వయం సంఘాల సభ్యులకు వీ హబ్ ద్వారా శిక్షణ ఎంపిక కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన మహిళలకు ట్రైకార్ ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ ద్వారా కూడా పరిశ్రమలు, వ్యాపారాలు పెంచుకునే అవకాశం ఉందన్నారు.
ఎలాంటి వ్యాపారం లేని వ్యాపారంలో శిక్షణ కల్పించడం, వ్యాపారం చేస్తున్న వారిని మరింత అభివృద్ధి పర్చేందుకు రుణ సహాయం కల్పిస్తున్నామని వివరించారు. . వీ హబ్ ద్వారా ఎంపిక చేసిన మహిళలకు శిక్షణతో పాటు సబ్సిడీపై రుణసాయం అందిస్తామన్నారు. బ్యాంకు ద్వారా అందించే రుణం మంజూరు విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా తాను స్వయంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సమాఖ్య అధ్యక్షులు సరిత, ఉమ, వీహబ్ ట్రైనర్స్ శృతి, తరుణ్,డీపీఎం సతీశ్, జెడీఎం కొండల్రావు,జేఆర్పీలు భిక్షపతి, సరస్వతి, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.