ములుగు : ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరుగుతోంది. మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని బిల్ట్ ఫ్యాక్టరీ ఇంటెక్ వెల్ వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. నదీ పరీవాహక ప్రాంతంలో నివసించే వారు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.