తాడ్వాయి, జూన్23 : విద్యుత్ తీగలు తెగిపడి ఆరు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన తాడ్వాయి మండలం నార్లాపురం సమీపంలోని చింతల క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పశువుల కాపరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నార్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు పాడి బర్రెలను మేత కోసం అడవికి తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో చింతల్క్రాస్ వద్దకు చేరుకోగానే ఎల్బాక గ్రామానికి చెందిన విద్యుత్ తీగలు తెగి బర్రెలపై పడిందన్నారు. దీంతో విద్యుత్ షాక్కు గురైన బర్రెలు అక్కడిక్కడే మృతి చెందాయన్నారు.