ములుగు : ములుగు జిల్లాలో మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రాధ టీ.ఎం.టీ స్టీల్ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు మహా జాతరల తో పాటు మినీ జాతర ల సందర్భంగా వచ్చే భక్తులకు మినరల్ వాటర్, మజ్జిగను అందజేస్తు న్నామని కంపెనీ ఎండి అక్షత్ షరాఫ్ వెల్లడించారు.
శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం, ఆర్టీసీ బస్టాండ్, ఇంచర్ల సమీపంలోని ఎర్రి గట్టమ్మ దేవాలయం వద్ద ఉచిత మినరల్ వాటర్, మజ్జిగ పంపిణీ కేంద్రాలను కంపెనీ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ నెల 20వ తేదీ వరకు ఉచిత సేవలందిస్తామని వెల్లడించారు. మేడారం తో పాటు, జాతరకు చేరుకునే వివిధ మార్గాల్లోని ముఖ్య ప్రదేశాలలో కరోనా నిబంధనలను తెలిపే అవగాహన బోర్డ్ లను సైతం తమ కంపెనీ ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ జీ.ఎం విరేష్ కుమార్, ఏ.జీ.ఎం నరేశ్, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జీలు ఆంజనేయ, కంపెనీ డీలర్ గంగిశెట్టి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. రవీందర్ రెడ్డి, కోశాధికారి సుబ్బారెడ్డి ఉపాధ్యక్షుడు చుంచు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.