ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోని గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శిరీష్(8) అనే 4 వ తరగతి చదువుతున్న బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. శిరీష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.