రిజర్వేషన్ల పెంపుపై విషంకక్కిన కేంద్రప్రభుత్వంపై గిరిజనులు కన్నెర్ర చేశారు. ఏనాడో మన అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా, రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలాడిన కేంద్రం తీరుపై మండిపడ్డారు. బుధవారం జిల్లావ్యాప్తంగా స్థానిక టీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. నల్లబెల్లిలో కేంద్రమంత్రి, నెక్కొండలో పీఎం మోదీ, నర్సంపేట మండలంలోని రాజుపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘బీజేపీ హఠావో.. రిజర్వేషన్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. నల్లబెల్లిలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర వైఖరితో గిరిజన నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కప్పి పుచ్చుకోవడానికి రాష్ట్ర కేబినెట్ తీర్మానం అందలేదని కేంద్రం దాటవేయడం హేయమైన చర్య అన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
– నమస్తే నెట్వర్క్
నల్లబెల్లి, మార్చి 23: రిజర్వేషన్ల పెంపుపై విషం కక్కిన కేంద్రంలోని మోదీ సర్కారుపై గిరిజనులు కన్నెర్ర చేశారు. బుధవారం జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. నల్లబెల్లిలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు తక్షణమే రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ఎస్టీ జనాభాకు అనుగుణంగా ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఏళ్లు గడుస్తున్నా స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రధాని మోదీ వైఖరితో తెలంగాణలోని ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు. కేంద్రం గిరిజనులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రం నుంచి కేబినెట్ తీర్మానం రాలేదని కేంద్రం దాటవేయడం హేయమన్నారు. దీనికి బాధ్యులైన కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ను తక్షణమే బర్తరఫ్ చేసి తెలంగాణలోని గిరిజనులకు క్షమాపణ చెప్పాలని పెద్ది డిమాండ్ చేశారు. మోదీ సర్కారు గిరిజనుల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎస్టీల రిజర్వేషన్ వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం మండలకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ మండల అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, సర్పంచ్లు నానెబోయిన రాజారాం, లావుడ్యా తిరుపతి, బానోత్ పూల్సింగ్, నునావత్ వెంకన్ననాయక్, రాజునాయక్, కలకోటి కిరణ్, నాయకులు గందె శ్రీనివాస్గుప్తా, హింగ్లి శివాజీ, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
ఎస్టీల రిజర్వేషన్ పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినా ఇప్పటివరకు ఎలాంటి లేఖలు రాలేదని తప్పుడు ప్రకటన చేసిన కేంద్రమంత్రి బిశ్వేశ్వరన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ బదావత్ విజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంట టీఆర్ఎస్ నాయకులు భూక్యా లింగం, ఆంగోత్ వీరాసింగ్, బానోత్ గణేశ్, బోడ సమ్మునాయక్, భూక్యా మేఘ్యానాయక్, గిరిజనులు పాల్గొన్నారు. నర్సంపేట మండలంలోని రాజుపేటలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. కేంద్రమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ దస్రూ, ఎంపీటీసీ బదావత్ వీరేంద్ర, మండల నాయకులు మోతె పద్మనాభరెడ్డి, అల్లి రవి, తాళ్లపల్లి రాంప్రసాద్, గంధం జగన్మోహన్రావు, పీఏసీఎస్ డైరెక్టర్ బానోత్ లక్ష్మణ్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ నెక్కొండలో టీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జాటోత్ రమేశ్ మాట్లాడుతూ పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, టీఆర్ఎస్ సర్పంచ్లు బానోత్ రవి, వీరూనాయక్, అరవింద్, హంసమ్మ, ఎంపీటీసీ కవితాగోపీనాయక్ పాల్గొన్నారు.
రాయపర్తి: కేంద్ర ప్రభుత్వం ఎస్టీలను చిన్నచూపు చూస్తున్నదని టీఆర్ఎస్ ఎస్టీసెల్ మండల ప్రధాన కార్యదర్శి మాలోత్ వసుంధర్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్టీలు కార్యాచరణ రూపొందించుకుని తమ సత్తా చాటుతామన్నారు. సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, సర్పంచ్లు గారె నర్సయ్య, జగన్, నేతాత్ కిషన్, రవి, దేదావత్ కమలా వెంకన్న, ఎన్ సారయ్య, ఎంపీటీసీలు భూక్యా గోవింద్నాయక్, నాయకుడు మందడి సుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ సోమానాయక్, ఎల్లస్వామి పాల్గొన్నారు.