జగిత్యాల : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) శనివారం జగిత్యాల పట్టణంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం( Independence Day ) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కేంద్రంలో గొల్లపల్లి రోడ్ పాత బస్టాండ్ లో డీజిల్ ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఆటో కార్మికులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారికి నెలకు రూ. వెయ్యి పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఈ ఆటో సబ్సిడీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్టు ఆటో కార్మికులకు ఆటో కొనుగోలుకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఫిట్నెస్ తో పాటు ఆటో కార్మికులకు వాహన,హెల్త్ ఇన్స్రెన్స్ కల్పించాలని సూచించారు . డబుల్ బెడ్రూం ఇండ్లలో ఆటో కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవన్ జగిత్యాల కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు.