న్యూశాయంపేట, ఫిబ్రవరి 11 : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆయన పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు శాసనసభ ఆవరణలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రశాంత్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆదివారం మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరుగనుంది.