గణపురం : గడిచిన ఏడున్నర ఏండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం నుంచి మంజూరైన పథకాలను అందజేస్తు అందరి మన్ననలను పొందుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం గణపురం మండలంలోని 10 మంది లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను, ఒకరికి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే మాటాడుతూ.. పేదల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రారంభించారని వివరించారు.
రైతులు వరి ధాన్యానికి బదులుగా పొద్దు తిరుగుడు, వేరుశనగ, నువ్వులు, పల్లి లాంటి పంటలు వేయాలని సూచించారు. ప్రత్నామ్నయ పంటల పై త్వరలో అవాగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీశ్ కుమార్, ఆర్ఐ సాంబయ్య, గణపురం పీఎసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, టీఆర్ఎస్ గణపురం మండల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోట్ల నగేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.