హనుమకొండ, ఆగస్టు 24 : కష్ట సుఖాల్లో తోడుం టూ జీవితాల్లో వెలుగులు నింపుతున్న బీఆర్ఎస్ ప్రభు త్వం దివ్యాంగుల ధైర్యమని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీఆర్డీవో శ్రీని వాస్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్ కాపీలను అందజేత కార్యక్ర మానికి చీఫ్విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి దివ్యాంగులకు పెరిగిన ఆసరా పింఛన్ల ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు. అనంతరం చీఫ్విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ది వ్యాంగులు తమవంతు పాత్ర పోషించారన్నారు. ఉద్య మ పోరాటంలో పాల్గొన్న దివ్యాంగులను కొందరు అవహేలన చేసినప్పటికీ పోరాటం చేశారన్నారు. గత పాలకులు దివ్యాంగులను పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం దివ్యాంగులతో పాటు, అన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరం పెరిగిందన్నారు.
దివ్యాంగుల ధైర్యం బీఆర్ఎస్ ప్రభుత్వమని చీఫ్విప్ అన్నారు. మనసున్న సీఎం కేసీఆర్ అని, దివ్యాంగుల సాధకబాధకాలు తెలిసే వారి పింఛన్ పెంచారన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో దివ్యాంగులు ఎన్నో కష్టాలు అనుభవించే వారన్నారు. గతంలో రూ. 500 పింఛన్ ఇస్తే, నేడు రూ. 4016 అందిస్తున్నారని తెలిపారు. నాడు దివ్యాంగులు ఆత్మనూన్యతతో బతికితే నేడు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చీఫ్విప్ స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిథిలోని 2390 మంది దివ్యాంగులకు రూ. 4016ల చొప్పున నెలకు మొత్తం రూ. 95,98,240లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో సైతం దివ్యాంగులకు ప్రత్యేక కోటాను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
దివ్యాంగులకు అవసరమైన రుణాలను, ఉపకరణాలను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్విప్ దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు. దివ్యాంగులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు సైతం పెన్షన్ ఇచ్చి గౌరవించారన్నారు. దివ్యాంగులు ఓటు వేసేందుకు ఈ సారి పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని దివ్యాంగులు వినయోగించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ను మీరందరూ దీవించాలని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని చీఫ్విప్ అన్నారు. కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా, జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్జీ, అధికారులు పాల్గొన్నారు.
న్యూశాయంపేట: నగరం భవిష్యత్లో వరద నీటి ముంపు భారినపడకుండా చర్యలు చేపడతామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు నగరం ముంపు భారినపడిన నేపథ్యంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, నాలలపై అక్రమణలను తొలగిస్తున్నామని, ఇక ముందు ఆక్రమణలు కాకుండా జీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో చేపడతామని సృష్టం చేశారు. డివిజన్లోని కాలనీలు ఇటీవల వరద నీరుకు నీట మునగగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు.
నాలాలపై ఆక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఇటీవల వరదలకు కొట్టుకు వచ్చిన మొసళ్లు కాలనీ నీటి మడిగులో సంచరించగా, సంచరిస్తున్న మొసళ్లను తక్షణమే తరలించే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు, మున్సిపల్ కమిషనర్కు సూచించారు. అనంతరం భద్రకాళీ చెరువులోకి వెళ్తున్న న్యూశాయంపేట నాలాను, పరిసరాలను పరిశీలించారు. నాలాల పూడికతీత, విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్ పాల్గొన్నారు.