పరకాల, డిసెంబర్ 12: నియోజకవర్గ అధివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. అందరూ అంకితభావంతో పని చేస్తేనే నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పెండింగ్ పనులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పట్టణంలో నిర్మిస్తున్న వంద పడుకల దవాఖాన నిర్మాణ పనులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పట్టణంలో అన్ని హంగులతో వంద పడుకల ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు చెప్పారు. మిగిలి ఉన్న పనులు, పెండింగ్ బిల్లుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దవాఖాన నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు వెంటనే అందించాలని ఆదేశించారు. సమీక్షలో సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గౌతమ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామి, కౌన్సిలర్ పంచగిరి జయమ్మ పాల్గొన్నారు.
దామెర: విధులపై అంకితభావం కలిగి నిబద్ధతతో పని చేయాలని కార్యదర్శులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంజెపల్లి నరేశ్ ఆధ్వర్యంలో పరకాల డివిజన్లోని పంచాయతీ కార్యదర్శులు రేవూరిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అర్గనైజింగ్ సెక్రటరీ అర్షం శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు మనోహర్, ప్రచార కార్యదర్శి యాదగిరి, సునీల్, వేణుమాధవ్, అన్నపూర్ణ, పద్మ, అమిత, సరళ, అనూష పాల్గొన్నారు.