నర్సంపేట, జూలై 6: ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నర్సంపేటకు మెడికల కళాశాల మంజూరైందని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేటకు ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. తాను ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఊహకందని విధంగా నర్సంపేట డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. నర్సంపేట అభివృద్ధిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ కృషి మరువలేనిదన్నారు. గతంలో ఇక్కడ పని చేసిన ఎమ్మెల్యేల పనితీరును నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని పెద్ది అన్నారు. తాను 2014 ఎన్నికల్లో గెలిచి ఉంటే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేదన్నారు. సాగునీరు, వైద్య, విద్యా రంగంలో ఎనిలేని అభివృద్ధిని సాధించుకున్నామన్నారు. తాను నర్సంపేటకు మెడికల్ కళాశాలను మంజూరు చేయించినా ప్రతిపక్ష నాయకులకు స్వాగతించే గొప్ప మనస్సు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేసినప్పుడు రాజకీయాలను పక్కనపెట్టి ఆశీర్వదించాలన్నారు.
కుట్రలను ప్రతి గడపకూ వివరిస్తా..
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు తీసుకొస్తే ప్రతిపక్ష నాయకులు స్టే తెచ్చి ఆపుతున్నారని పెద్ది విమర్శించారు. వారి కుట్రలను ప్రతి గడపకూ వివరిస్తానని స్పష్టం చేశారు. మెడికల్ కళాశాల మంజూరు వల్ల జిల్లా దవాఖానలో అదనంగా 250 పడకలు పెంచే అవకాశం ఉంటుందన్నారు. మెడికల్ కళాశాలలోనే నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను ప్రతి గ్రామంలో తప్పకుండా అమలు చేస్తామన్నారు. మెడికల్ కాలేజీ కూడా ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం నిర్మాణం చేస్తామని తెలిపారు. నెల రోజుల్లో ఎన్ఎంసీ టీం సభ్యులు ఇక్కడి వచ్చి అన్ని ప్రాంతాలను పరిశీలించి ఎంపిక చేస్తారన్నారు. సమావేశంలో జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, రాయిడి రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ విద్యాసాగర్రెడ్డి, గుంటి కిషన్, ఎంపీపీ రమేశ్, గోనె యువరాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పెద్ది కృషి ఎనలేనిది
నర్సంపేట/నెక్కొండ/నర్సంపేటరూరల్: నర్సంపేటకు మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కృషి ఎనలేనిదని సిద్థార్థ డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపాల్, డైరెక్టర్ గోగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పెద్దికి పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సన్మానించారు. నర్సంపేట వైద్య, విద్యా హబ్గా తయారైందన్నారు. ఎమ్మెల్యేను అభినందించిన వారిలో కాకతీయ కళాశాల ప్రిన్సిపాల్ వీరమల్ల మాధవరెడ్డి ఉన్నారు. అలాగే, నర్సంపేట సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలోనూ పెద్దిని సన్మానించారు. కార్యక్రమంలో జీజుల సాగర్, సిద్థార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్రెడ్డి, రాయబోస్, కోదాటి గోపాలకృష్ణ, కోడం శ్రీధర్, మోతె ఇంద్రసేనారెడ్డి, కామగోని శ్రీనివాస్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, గుంటి కిషన్, జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంపిణీ చేసి ఎమ్మెల్యేకు మిఠాయి తినిపించారు. అలాగే, నెక్కొండలోని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, గుండ్రపల్లి, దీక్షకుంట సర్పంచ్లు బోంపెల్లి రాజేశ్వర్రావు, ఆలకుంట సురేందర్, నాయకులు మాతంగి రాజు, బక్కి కుమారస్వామి పాల్గొన్నారు. అంతేకాకుండా నర్సంపేట మండలంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్దిని ఘనంగా సన్మానించారు. నర్సంపేట పట్టణం ద్వారకపేట శ్రీవేణుగోపాల, శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల వెంకటాచార్యులు, ఆరుట్ల శ్రీధరాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ గంధం నరేందర్గుప్తాతోపాటు పలువురు అర్చకులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రామసహాయం శ్రీదేవి, మినుముల రాజు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.