నెక్కొండ, మే 25: గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని సూరిపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల చెంతకే మెరుగైన వైద్యాన్ని తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ పల్లె దవాఖానలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. వైద్య సేవలను పల్లెలకు విస్తరించేందుకే ప్రభుత్వం ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వివరించారు. పల్లె దవాఖానలో వైద్యుడితోపాటు ఇద్దరు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వైద్య సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్ గీతా భాస్కర్ పాల్గొన్నారు.
సొంత వాహనాల్లో ధాన్యం తరలించాలి
నర్సంపేటరూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సొంత వాహనాల్లో మిల్లులకు తరలిస్తే రైతులకు నేరుగా చెల్లింపులు చేసుకునే బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని ముగ్దుంపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయా కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం రవాణా విషయంలో గన్నీ సంచుల సమస్యలపై రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని, సంబంధిత ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సొంత వాహనాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే విషయమై రైతులను చైతన్యం చేయని సంబంధిత ఏజెన్సీలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని పెద్ది హెచ్చరించారు. ఆయన వెంట శ్రీరామ ధాన్య విత్తన సంఘం అధ్యక్షుడు అర్శనపెల్లి మాధవరావు, బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల ప్రభాకర్, నూనె కుమారస్వామి, రైతులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని కలిగి ఉండాలి
ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని రాజేశ్వర్రావుపల్లి, రాంనగర్లో నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో గురువారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పెద్ది పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవమార్గంతోనే అన్నీ జయించొచ్చని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బొజ్జ యువరాజ్, చంద్రయ్యపల్లి ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ తాటికొండ సునీత, కులపెద్దలు తాటికొండ సుదర్శన్, సుధాకర్, పిట్టల తిరుపతి, బొజ్జ కృష్ణంరాజ్, దుర్గస్వామి, బాబు, కీసరి సంజీవ, రానబోయిన భిక్షపతి, సాంబయ్య, తాటికొండ చిరంజీవి, మోటం ప్రభాకర్, తిరుపతి, పోలు శంకర్, సాంబయ్య పాల్గొన్నారు.