నర్సంపేట, నవంబర్ 1: కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 14వ వార్డుకు చెందిన ముస్లింలు బుధవారం పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్ సర్కారుకే సాధ్యమన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్కు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. తాను నర్సంపేట డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఒక టర్మ్ ఎమ్మెల్యేగా గెలిచినందుకే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, మరోసారి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 14వ వార్డునకు చెందిన రశీదు, రియాజ్, మహబూబ్, బుడెన్, సర్వర్, జావిద్, రషీద్, ఇమ్రాన్, ఆఫ్రీద్, షరీఫ్, అజిత్, యాకూబ్, తాజ్, ప్రభాస్, గణేశ్, అహ్మద్, జమీల్, సమీర్, ఖాజా, మసూద్, అక్బర్, యాకూబ్, మహ్మద్, పాషా, ఇమ్రాన్, సోను, నజాముద్దీన్, మున్వర్, శ్రవణ్, షహీద్, యాకూబ్, శివ, రాము, బాబా, ఫజల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నల్లా మనోహర్రెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్/నెక్కొండ/నల్లబెల్లి/ ఖానాపురం: సీఎం కేసీఆర్ సహకారంతో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురిజాలలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొర్ర వీరభద్రు, బానోత్ నాగరాజు, బానోత్ సురేశ్, బోడ రోహిత్, బానోత్ అనిల్, జక్కుల రాజుతోపాటు మరికొందరు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశాల మమత-సదానందంగౌడ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, కడగండ్ల రాము, కడగండ్ల రాజు, పత్రి పవన్కల్యాణ్, సోషల్ మీడియా వారియర్ రేకుల భరత్, గుగులోత్ శ్రీను, చుండు నవీన్ పాల్గొన్నారు. అంతేకాకుండా నెక్కొండ మండలం టేకులకుంట ఇంద్యాతండాకు చెందిన 30 కాంగ్రెస్ కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరిన వారిలో భూక్యా మోహన్, ప్రతాప్, గుగులోత్ భాస్కర్, హచ్చి, బాలి, లకావత్ సుమన్, నవీన్, భూక్యా కమలమ్మ, గుగులోత్ వెంకన్న, బానోత్ వీరన్న, బానోత్ వెంకటేశ్, భూక్యా బిక్యా, భూక్యా వాగ్య, భూక్యా కిషన్, లకావత్ నరసింహ, భూక్యా మంగమ్మ, లకావత్ రంగమ్మ, బానోత్ వెంకన్న, బోడ బుజ్జి, భూక్యా చిలకమ్మ, బానోత్ కమలమ్మ, లకావత్ భిక్షపతి, శ్రీను, భూక్యా శ్రీను, శ్రీనివాస్, బద్రి ఉన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్, భద్రయ్య పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట, బుచ్చిరెడ్డిపల్లె, రుద్రగూడెంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ చేరాయి. పార్టీలో చేరిన వారిలో పులిగుజ్జుల రాజమల్లు, గడ్డం కుమారస్వామి, భూక్యా అశోక్, జాటోత్ కిషన్, భూక్యా రమేశ్, బానోత్ యాకూబ్, గుగులోత్ సైదులు, జగన్, రాజ్కుమార్, రామ్సింగ్, దేవ్సింగ్తోపాటు మరో పది మంది ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు కోటిలింగాచారి, తంగెళ్ల నిర్మలా రవీందర్రెడ్డి, నునావత్ వెంకన్ననాయక్, హరినాద్సింగ్. ఇంగ్లి శివాజీ, ఎం రవికుమార్, బాలోజీ పాలొన్నారు. అంతేకాకుండా ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో ముదురు కుమారస్వామి, కొనకటి దేవేందర్, శీలం రాములు, దేవేందర్రావు, వెంకన్న, రమేశ్, కొమ్మాలు, సతీశ్, రంజిత్, అనిల్, మోహన్, ఎల్లస్వామి, సాంబరాజుతోపాటు 50 మంది ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రకాశ్రావు, బత్తిని శ్రీనివాస్గౌడ్, వెన్ను పూర్ణచందర్, మేకల కుమారస్వామి, మేడి సమ్మయ్య, నవీన్, వెన్ను సమ్మయ్య, కత్తాల వెంకటేశ్వర్రావు, కరుణాకర్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: రాష్ట్రంలో ప్రజలందరూ బీఆర్ఎస్ గెలుపును కోరుకుంటున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తిమ్మరాయిన్పహాడ్కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమంతోపాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తున్నామన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతిపక్షంలో నాయకులు, కార్యకర్తలు కాళీ అవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు తిరుగులేని ఆధక్యం అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ యూత్ మండల కన్వీనర్ కంది కృష్ణచైతన్యరెడ్డి, నాయకులు బద్దూనాయక్, మూడు రమేశ్ పాల్గొన్నారు.