చెన్నారావుపేట, మార్చి 31 : బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి, సీఎం కేసీఆర్ను మరోమారు ఆశీర్వదించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కార్యకర్తలను కోరారు. అమీనాబాద్ గ్రామ రైతు వేదికలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీ య సమ్మేళనాన్ని నిర్వహించారు. పత్తినాయక్తండా, అమీనాబాద్, లింగగిరి, శంకరాంతం డా, తోపనగడ్డతండా, సూర్యాపేటతండా, గొల్లభామతండా, గొల్లపల్లి, ఖాదర్పేట, కందిగడ్డతండా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కారకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ను మూడోసారి అధికారంలో తీసుకొచ్చి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. గ్రామాలు, తండాల్లో జరిగిన అబివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతోందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ పట్టుదలతో అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేసి, గోదావరి, దేవాదుల నీళ్లు నియోజకవర్గానికి తీసుకొచ్చి సస్యశ్యామలం చేశానని పేర్కొన్నారు. వ్యవసాయ పరికరాలు, సబ్సిడీపై మోటర్లు, పైపులు అందించానన్నారు. డీబీఎం కాల్వల ద్వారా మండలంలోని ప్రతి చెరువును నింపి వేసవిలో సైతం మత్తడి దుంకించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నర్సంపేట నియోజకవర్గానికి ప్రత్యేక నిధులతోపాటు పంట నష్ట పరిహారం అందించేందుకు కృషి చేశానన్నారు. ఎమ్మెల్యేగా తాను చేసిన అబివృద్ధి, గత ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా పంటలను సందర్శించి, రైతులకు పరిహారం అందించిన నియోజకవర్గం నర్సంపేట అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీర్మానం చేసింది తానేనన్నారు. ప్రతి గ్రామం, తండాకు సీసీ, బీటీ రోడ్లు నిర్మాణం చేశామన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న విపక్షాలు
విపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ యాత్రల పేరుతో ప్రజలకు మాయమాటలు చెబుతూ అభివృద్ధిని అడ్డుకునేలా కుట్ర చేస్తున్న నాయకులను గ్రామాల్లో నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్రెడ్డి, బండి సంజయ్ ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు కట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీటీసీ పత్తినాయక్, ఎంపీపీ బదావత్ విజేందర్, జక్క అశోక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, క్లస్టర్ బాధ్యులు సత్యనారాయణరెడ్డి, బాల్నె వెంకన్న, చెన్నారెడ్డి, మురహరి రవి, కేతిడి వీరారెడ్డి, జున్నూతుల రాంరెడ్డి, కంది చైతన్యారెడ్డి, కుండె మల్లయ్య రాజు, రమేశ్ పాల్గొన్నారు.