నల్లబెల్లి, నవంబర్ 11: నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వీరతిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పెద్ది నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లె, అర్శనపెల్లి, రాయతీర్థం, పద్మాపురం, బుచ్చిరెడ్డిపల్లె, కన్నారావుపేట, శనిగరం, రుద్రగూడెం, బజ్జుతండా, గుండ్లపహాడ్, నారక్కపేట, బిల్యానాయక్తండా, అర్వయ్యపల్లెలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట డివిజన్లోని రైతుల అభివృద్ధి కోసం మండలానికి హార్టికల్చర్ రిసోర్స్ సెంటర్ను మంజూరు చేయించానని, తనను ఆదరించాలని కోరారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఏడు గ్రామాలను ముంపునకు గురిచేసి రంగాయచెరువు ప్రాజెక్టు నిర్మించేందుకు కుట్ర చేస్తే ఈ ప్రాంత ప్రజలు తరిమి కొట్టారని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రాంత సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అనుభవజ్జులైన రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారులతో రీ సర్వే చేయించి ముంపును నివారించి రబ్బరింగ్ సిస్టమ్ ద్వారా రంగాయచెరువు ప్రాజెక్టు నిర్మించామన్నారు. గోదావరి జలాలను తీసుకురావడంతో రంగాయచెరువు, పాకాల, మాదన్నపేట జలాశయాలకు జలకళ సంతరించుకొని రైతులు రెండు పంటలు పండిస్తున్నారని వివరించారు. అలాగే, ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇప్పించినట్లు గుర్తుచేశారు. తన గెలుపు ఖాయమైందని, అధిక మెజార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కోరారు. ప్రచారంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మండల ఎన్నికల ఇన్చార్జి, ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్గౌడ్, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాలెపు రాజేశ్వర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్/ఖానాపురం: తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్వన్గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట 13వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని పెద్ది అన్నారు. వేలాది కోట్ల రూపాయలతో నర్సంపేట డివిజన్ను అభివృద్ధి చేశానని, కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయని, కొన్ని పనులు కొనసాగుతున్నాయని, మరికొన్ని టెండర్ దశలో ఉన్నట్లు వివరించారు. అవన్నీ కొనసాగాలంటే తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మండల వినోద, బూస రాజ్కుమార్, దండు క్రాంతి, మంద మధు, కందంతల రవితేజ, అభిలాష్, వంశీ, రాజేశ్, లక్ష్మణ్, క్రాంతి, రవితేజ, రాజ్కుమార్, వంశీ, సురేశ్, నాగరాజు, శివాజీ, రాజు, హరీశ్, కనుకమల్లి, శివగణేశ్, రాజేశ్, శివ, శరత్, కమల్, రోహిత్, అవినాష్, రాకేశ్, వినయ్, రాజు, రాజశేఖర్, ఆకాశ్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, క్లస్టర్ బాధ్యులు నల్లా మనోహర్రెడ్డి, బండి ప్రవీణ్, రాణాప్రతాప్రెడ్డి, బోళ్ల స్వామి, పుల్లూరి స్వామి, మేడిద శ్రీను పాల్గొన్నారు.
అలాగే, నర్సంపేట మండలం మాదన్నపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. గ్రామానికి చెందిన డాక్టర్ పుట్ట రాజశేఖర్, మారపాక రమేశ్, బైరబోయిన నరేశ్, గొర్రె అజయ్, మారపాక తరుణ్, పుట్ట రోహిత్, గారబోయిన వంశీ, గంగరబోయిన తరుణ్, నిమ్మల రాకేశ్, పిట్టల శేషు, బరుపట్ల రాఘవేంద్ర, మారపాక రమేశ్, కల్వచర్ల రాజు, పెండ్యాల రమేశ్తోపాటు మరికొంత మంది పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, ఎంపీటీసీ ఊడ్గుల రాంబాబు, క్లస్టర్ ఇన్చార్జిలు కడారి కుమారస్వామి, కట్ల సుదర్శన్రెడ్డి, మచ్చిక నర్సయ్యగౌడ్, గంగాడి తిరుపతిరెడ్డి, కట్టస్వామి, నర్సయ్య పాల్గొన్నారు. అంతేకాకుండా ఖానాపురం మండలం అశోక్నగర్కు చెందిన కాంగ్రెస్, సీపీఎం పార్టీలకు చెందిన యువకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో దొంత జగన్, శంకర్తోపాటు మరికొంత మంది ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు ముచ్చా యాదగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, వార్డు సభ్యుడు ముద్దంగుల సంపత్, రామసహాయం ఉపేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి, రవి పాల్గొన్నారు.