దుగ్గొండి, ఆగస్టు 30: రైతు కష్టం తెలిసిన నేత సీఎం కేసీఆర్ అని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన నర్సంపేట రైతాంగంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గత మార్చిలో అకాల వర్షానికి పంటలు నష్టపోయిన రేఖంపల్లి క్లస్టర్ పరిధిలోని అడవిరంగాపురం, మదిర మందపల్లి, చాపలబండ, వెంకటాపురం శివాజీనగర్, గిర్నిబావి, పీజీతండా, రేఖంపల్లి, రాజ్యాతండా, మందపల్లి గ్రామాల రైతులకు ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మండలకేంద్రంలో చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలకు నియోజకవర్గంలోని రైతులు పంటలు నష్టపోయారని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని ఒప్పించి.. ఇక్కడకు రప్పించి ప్రత్యేక జీవో ద్వారా రాజకీయాలకతీతంగా నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం చెక్కులు అందించామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలు దెబ్బతింటే రైతులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట నష్టపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందించి రైతు కుటుంబాలను ఆదుకుంటున్నదన్నారు. గత ఏడాది అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ. 13,500, గత మార్చిలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున చెక్కులు అందజేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. రెండు మూడు రోజుల్లో మండలంలోని అన్ని గ్రామాలకు క్లస్టర్ వారీగా పరిహారం చెక్కులు అందజేస్తామన్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగొద్దనే ఉద్దేశంతో వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల వారీగా రైతు సమావేశాలు నిర్వహించి, పరిహారం చెక్కులతోపాటు దరఖాస్తు చేస్తున్న రైతులకు కావాల్సిన వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను అందించాలని అధికారులను ఎమ్మెల్యే పెద్ది ఆదేశించారు. మండలవ్యాప్తంగా మొత్తం 10,294 ఎకరాల్లో పంటనష్టం జరుగగా, రైతులకు మొత్తం రూ. 11 కోట్ల పరిహారం అందజేశామన్నారు. వీటితోపాటు మండలవ్యాప్తంగా రైతులకు సబ్సిడీపై విద్యుత్ మోటర్లు, పీవీసీ పైపులు, పనిముట్లు అందించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండాపోయి పస లేని ప్రచారాలు చేస్తున్నాయని, రానున్న రోజుల్లో ప్రజలు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదని ఎమ్మెల్యే పెద్ది ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి పరాభావం తప్పదన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖయమని స్పష్టం చేశారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు రాని ప్రతిపక్ష నాయకులు పూటకోమాట మాట్లాడుతూ పగటి వేషాలతో మళ్లీ వస్తున్నారని విమర్శించారు. వారిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ తోట శ్రీనివాస్రావు, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ తోకల నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధి రాజ్కుమార్, పార్టీ నర్సంపేట నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి, మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ఏవో దయాకర్, పీఏసీఎస్ చైర్మన్ ఊరటి మహిపాల్రెడ్డి, ఏఈవోలు రాజేశ్, మధు, హన్మంతు, విశ్వశాంతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్లస్టర్ ఇన్చార్జిలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో మండలంలోని కొండైల్పల్లి, కన్నారావుపేటలోని కాంగ్రెస్, బీజేపీ నుంచి 20 కుటుంబాలు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. గొట్టిముక్కల రాము, కాసర్ల మధుసూదన్రెడ్డి, పెంతల ముకుందంరెడ్డి, కీసరి శ్రీనివాస్, పెంతల లింగారెడ్డి, మామిండ్ల లింగారెడ్డి, పెంతల విజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి 20 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడ్గుల ప్రవీణ్గౌడ్, ప్రధాన కార్యదర్శి కోటిలింగాచారి, సర్పంచ్లు మామిండ్ల మోహన్రెడ్డి, తంగెళ్ల నిర్మల, రవీందర్రెడ్డి, లూనావత్ వెంకన్న, సొసైటీ డైరెక్టర్ కొనకటి వీరమల్లు, వీరస్వామి పాల్గొన్నారు.