హనుమకొండ చౌరస్తా, మే 15: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తానని వరంగల్ పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం 10వ డివిజన్ కాపువాడ పీటీసీ పాఠశాల ఆవరణలో 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.25 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి బస్తీ, కాలనీలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని, సైడ్డ్రైన్, అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. కార్యకక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, స్థానిక డివిజన్ కార్పొరేటర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ నాసిమ్ జాన్, డివిజన్ అధ్యక్షుడు కుమార్యాదవ్, నాయకులు మామిడిశెట్టి సతీష్, పల్లం రమేష్, బొంత రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.