గిర్మాజీపేట, ఆగస్టు 29: విద్య, వైద్యం, ఉపాధి, భద్రత నా ట్యాగ్లైన్ అని.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి విజయఢంకా మోగిస్తా ’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రాజశ్రీ గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన 293 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులతో పాటు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడిన వారిని ఆదుకోవాలనే దృఢసంకల్పంతో సీఎం కేసీఆర్ బీసీ బంధు ద్వారా రూ. లక్ష సాయం అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాక ముందు ఇక్కడున్న నాయకులు ఆంధ్ర పెత్తందారుల కింద బానిసలుగా ఉండి అభివృద్ధికి అడ్డుపడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 24 గంటల విద్యుత్, నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, ఎరువుల సబ్సిడీ, గిట్టుబాటుధర, రుణమాఫీ ఇలా ఎన్నో పథకాలతో ప్రతి ఇంట్లో సంక్షేమం వెళ్లి విరుస్తోందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో కొడుకు లా, తమ్ముడిలా ఉంటేనే నాయకుడవుతాడని.. మావోడు.. మా బిడ్డ నన్నపునేని అని తనను అక్కున చేర్చుకున్నారని అన్నారు. తనపై బాధ్యతను నిర్వర్తించ డానికి సైనికుడిలా పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్నానని అన్నారు. మనం అన్ని రంగాల్లో బాగుపడాలంటే కలెక్టరేట్ వరంగల్ తూర్పులో కావాలని సీఎం కేసీఆర్ను కోరి మరీ తీసుకొచ్చానన్నారు. గల్లీగల్లిలో రోడ్లు వేశాం. వచ్చే ఏడాది కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానన్నారు. అన్నీ వదులుకొని రాజకీయాలకు వచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమే అన్నారు. బీసీబంధు నిరంతర ప్రక్రియ, మరో విడుత 300 మందికి చెక్కులు అందజేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజల జీవితాలు బాగుపడాలంటే మరోసారి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షు లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో ’తూర్పు’ ముందంజ
పోచమ్మమైదాన్ : సీఎం కేసీఆర్ అండదండలతో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజకవర్గంలోని 22వ డివిజన్లో రూ.2.98కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో తెలంగాణ అద్భుతంగా ప్రగతి సాధిస్తోందని, అందులో భాగంగా తూర్పు నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాయన్నారు. నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కలెక్టరేట్, నూతన బస్స్టేషన్, ఇంటిగ్రేటర్ మార్కెట్లు, వాడ వాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు కంచర్ల శివ, నాయకులు ఆడెపు రవీందర్, రమేశ్గౌడ్, చిట్టిమల్ల రమేశ్బాబు, పెంచల గోపన్న, తిరుపతయ్య, రావులపల్లి వీరన్న, ఫక్రొద్దీన్, పాక సుధాకర్, చిప్ప వెంకటేశ్వర్లు, సోల రవి, జన్ను ప్రమోద్, జూపాక సురేశ్ పాల్గొన్నారు.
23డివిజన్లో రూ.3.95కోట్ల పనులకు..
వరంగల్ తూర్పులోని 23వ డివిజన్లో రూ. 3 .95కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కొత్తవాడ దశ దిశ మారనుంద న్నారు. డివిజన్లో బీఆర్ఎస్లోకి వలసలు పెరిగా య ని, అధిక మెజారిటీతో విజయం ఖాయమని ఆశా భావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ, నాయకులు రాజ్కిశోర్, డివిజన్ అధ్యక్షుడు బీసతీశ్, వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజ్, వేల్పుల సునీల్ యాదవ్, బీఅశోక్, బీ హరికృష్ణ పాల్గొన్నారు.