MLA Naini Rajender Reddy | మున్సిపల్, కుడా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పేదలను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు పేదలపై దాడి చేసి, వారి ఇండ్లు కూల్చేస్తున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా మున్సిపల్, కుడా అధికారులు పేదల ఇండ్లను కూల్చుతుండటం గమనార్హం.
తమ ఇండ్లు కూల్చొద్దని అధికారులను, జేసీబీని అడ్డుకున్న గుడిసె వాసులపై కాంగ్రెస్ నాయకులు, నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు తప్ప తాగి వచ్చి దాడి చేశారు. నాయిని అనుచరులు,కాంగ్రెస్ నాయకులు బాధిత మహిళలను బూతులు తిట్టడం వీడియోలో చూడొచ్చు. గుడిసెలు, ఇండ్లు కూల్చవద్దని కోర్టు స్టే ఉన్నా కూడా వారాంతపు సెలవులు చూసుకొని కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై దాడి జరుగుతున్నా చోద్యం చూస్తున్న పోలీసులు, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేదలపై దాడి చేసి, వారి ఇండ్లు కూల్చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరులు
వరంగల్ వెస్ట్ నియోజకవర్గ పరిధిలోని చెరబండ రాజు కాలనీలో కోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఉన్నా కూడా పేదల ఇండ్లను కుల్చుతున్న మున్సిపల్, కుడా అధికారులు
తమ ఇండ్లు కూల్చొద్దని అధికారులను,… https://t.co/fyRLdWMXsR pic.twitter.com/2XgbJsF4Tf
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026