అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అందరికీ సమన్యాయం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్రం కూడా పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని చల్లా డిమాండ్ చేశారు
-పరకాల, ఏప్రిల్ 14
పరకాల, ఏప్రిల్ 14 : అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతోందని, ఆయన ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ను గుర్తించి నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ఆయన పేరు పెట్టినట్లు తెలిపారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, వైస్ చైర్మన్ రేగూరి విజయ్పాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, గుండెబోయిన నాగయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
దామెరలో…
ఆత్మకూరు : ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగు జాడల్లో నడవాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చల్లా ఆవిష్కరించారు. రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బిల్లా రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పరకాల ఏసీపీ శివరామయ్య, ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ గరిగె కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండు రాము, సర్పంచ్ గురిజాల శ్రీరాంరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు దామెరప్పుల శంకర్, హింగె బాబురావు, ఆలేటి రాజమౌళి, నేరెళ్ల కమలాకర్, పుల్యాల రఘుపతిరెడ్డి, కృష్ణమూర్తి, గోల్కొండ శ్రీనివాస్, పున్నం సంపత్, మాజీ ఎంపీపీ జన్ను మల్లయ్య, దళిత బంధు మండల కోఆర్డినేటర్ గరిగె కృష్ణమూర్తి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పోలెం కృపాకర్రెడ్డి, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు దామెర రాజేందర్, దామెర రమేశ్, రవి, దామెర వినీల్, దామెర రాజు, కృష్ణ, కుమార్, వేల్పుల రాజేందర్, దామెర ఆనందం, పోతుల కొమ్మాలు పాల్గొన్నారు.
ఎల్గూర్ రంగంపేటలో..
సంగెం : ఎల్గూర్రంగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చల్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమన్నారు. అనంతరం సంగెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సాగర్రెడ్డి, కందకట్ల నరహరి, బుక్క మల్లయ్య, సర్పంచ్ పోతుల ప్రభాకర్, ఎంపీటీసీ పద్మ, సంగెం సర్పంచ్ బాబు, ఎంపీటీసీ మల్లయ్య, సంగెం సొసైటీ చైర్మన్ కుమారస్వామి , మాజీ సర్పంచ్ శాబోతు శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం నాయకులు, రమేశ్బాబు, సుమన్, అశోక్, శ్రావణ్, ఆరోగ్యం పాల్గొన్నారు.