సంగెం, నవంబర్ 10 : తెలంగాణ ప్రజలను వంచించిన దోహ్రుల పార్టీ కాంగ్రెస్ అని పరకాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. మండలంలోని నల్లబెల్లి, బాలునాయక్ తండా, కొత్తపల్లి, నార్లవాయి, ఎల్గూరు స్టేషన్, నర్సానగర్, బిక్కోజీనాయక్ తం డాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రా మాల్లో తిరుగుతూ స్థానికులను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. స్థానిక మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసపూరిత హామీలతో ఓట్ల కోసం వస్తు న్న కాంగ్రెస్, బీజేపీ నాయకులను నమ్మొద్దని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. దేశంలో ఓట్ల కోసమే బీజేపీ రాజకీయాలు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ప్రకృతి వనరులను దోచుకెళ్లారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో ఓట్ల కోసం వస్తున్నదని, ప్రజలు నమ్మొద్దని కోరారు. పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజల కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ యువతకు బంగారు భవిష్యత్ ఉందని, కాంగ్రెస్కు ఓటు వేస్తే జీవితాలను ఆగం చేస్తారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరాడని, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కాదని, నర్సంపేట, వరంగల్ పశ్చిమలో నమ్ముకున్న కార్యకర్తలను వదిలేసి ఇక్కడికి వచ్చాడన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.
సంగెం మండలం కాపులకనపర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చల్లా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడు తూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంద నే ధీమాతో ప్రజలు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. చేరి న వారిలో ప్రవీణ్, సతీశ్, సుభాశ్, శివ, కుమారస్వామి ఉన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు సారంగపాణి, జడ్పీటీసీ సుదర్శన్రెడ్డి, ఎంపీపీ కందకట్ల కళావతి, నాయకులు నరహరి, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.