రాయికల్, ఆగస్టు 18 : సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఎందుకంటే సమాజంలో మార్పు అనేది మనం కోరుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎలా ఉన్నా బలహీనవర్గాల కులవృత్తులను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసా అందించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభిస్తే.. రేవంత్ రెడ్డి వాటిని కనుమరుగు చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎకడాలేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తే.. ఇప్పుడు కొత్త పింఛన్లు రావడం లేదని వాపోయారు. మంగళవారం రాయికల్ మండలం అల్లీపూర్లో సర్వా యి పాపన్న విగ్రహాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, సాధారణ గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న, గోలొండ కోటపై జెండా ఎగురవేయడం అంటే ఎవరూ ఊహించలేదని కొనియాడారు. ఆనాడు బహుజన సమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పాపన్న చేసిన పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని, రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయిస్తే 51శాతం బహుజన్లు ఉన్నారని, అదే రేవంత్రెడ్డి సర్వే చేయిస్తే బీసీల శాతం ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ఎకడైనా జనాభా పెరుగుతుందా.. తగ్గుతుందా? అనేది రేవంత్ రెడ్డికే తెలియాలన్నారు. గౌడ కులస్తులకు చెట్లు పెంచడానికి ఐదెకరాల భూమి ఇవ్వాలని జీవో ఉందని, ప్రభుత్వమేమో భూమి ఎకడికెళ్లి ఇవ్వాలని అంటుందని మండిపడ్డారు. ఒకవేళ భూమి లేకపోతే భూ కొనుగోలు పథకం ద్వారా భూమి కొని అందులో చెట్లు పెట్టి ఇవ్వాలని సూచించారు. ఎందరో గీత కార్మికులు చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ప్రమాద బీమా డబ్బులు బాధితులకు అందడం లేదని వాపోయారు.