పరకాల, సెప్టెంబర్ 29 : రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ, పరకాల, నడికూడ మండలాలకు చెందిన 133 మంది లబ్ధిదారులకు ల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను శుక్రవారం పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలువాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలో గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ అజెండా అన్నారు. ప్రతిపక్షా లు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజలు వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, పరకాల, నడికూడ మండలాల జడ్పీటీసీ సిలివేరు మొగిలి, కోడెపాక సుమలత పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, నార్లాపూర్, చర్లపల్లి, పులిగిల్ల గ్రామాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.4.10కోట్లతో వెంకటేశ్వర్లపల్లి నుంచి నార్లాపూర్, మర్రిపెల్లి గూడెం, నర్సింగపురం వరకు నూతన బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.25కోట్లతో నార్లాపూర్ నుంచి పరకాల వరకు బీటీ రోడ్డు పనులకు, రూ.18.52కోట్లతో పెద్దవాగుపై చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, వారితో మాట్లాడారు. అనంతరం చర్లపల్లి నుంచి మర్రిపెల్లి గూడెం వరకు రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు, చర్లపల్లిలో పల్లె దవాఖాన, మహిళా కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ముస్త్యాలపల్లి సెక్టర్లో పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రూ.2.90కోట్లతో పులిగిల్ల నుంచి చౌటుపర్తి గ్రామానికి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.20లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీల్లో ఒక్కటీ ఆచరణకు సాధ్యమయ్యేది కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ రజాక్, మహ్మద్ ఆదాంసాబ్, రంజాన్, మహ్మద్ షేక్ మహమూద్, రజాక్, రహీమ్, రాజ్ మహ్మద్, ఖరీం, జిలానీ, రఫీ, విక్రమ్రెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సాధు నిర్మలా సమ్మిరెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ కోడెపాక సుమలత, ఏఎంసీ చైర్మన్ తిప్పని హైమావతీ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, పార్టీ మండల అధ్యక్ష,కార్యదర్శులు దురిశెట్టి చంద్రమౌళి, నందికొండ గణపతిరెడ్డి, మాదారం సొసైటీ చైర్మన్ నల్లెల లింగమూర్తి, సర్పంచ్లు తిప్పర్తి సాంబశివారెడ్డి, పెండ్లి రాజు, గోల్కొం డ సదానందం, నాయకులు జయపాల్రెడ్డి, యూత్ నాయకులు బొల్లారం అనిల్, పోచంపల్లి రఘుపతి, పోశాల అశోక్ పాల్గొన్నారు.