దామెర/ఆత్మకూరు, నవంబర్ 14 : వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ సీఎం కేసీఆర్ పాలనలో పచ్చబడ్డ తెలంగాణను సర్వనాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని, ప్రజలు గమనించి తిప్పికొట్టాలని పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం దామెర మండలంలోని సీతారాంపురం, దుర్గంపేట, తక్కళ్లపహాడ్, ముస్త్యాలపల్లి, ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్, కొత్తగట్టు, మల్కపేటలో గ్రామాల్లో ఎన్నిల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి పంటలకు సాగునీరు అందించి రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చారన్నారు. ఢిల్లీ దొంగల పార్టీలైన బీజేపి, కాంగ్రెస్ను నమ్మితే తెలంగాణను అంధకారం చేస్తారని విమర్శించారు. అధికారం కోసం కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తున్నదని, ఆ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి, బీజేపి అభ్యర్థి కాళీప్రసాద్ ఏనాడూ పరకాల నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మెండుగా ధాన్యం పండుతున్నదని, వచ్చే నెల నుంచే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని పేర్కొన్నారు. పరకాలలో గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. పెద్దాపురం పీఏసీఎస్ డైరెక్టర్ పౌడాల మధు, నూకల రవీందర్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ యువకులకు రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.
మెగా టెక్స్టైల్ పార్క్లో 11,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే జీవితాలను ఆగం చేస్తారన్నారు. గ్రామాలు కూడా తెలియని నాయకులు టూరిస్టులుగా వచ్చి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, సర్పంచ్లు తుత్తురు శ్రీనివాస్, యాద రాజేశ్వరి, వడ్డేపల్లి శ్రీనివాస్, ఎంపీటీసీ గండు రామకృష్ణ, జుగున్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు చెల్పూరి చంద్రయ్య, పుచ్చకాయల నర్సింహారెడ్డి, ఆవాల రవీందర్, నూకల వీరేశం, దాడి రమేశ్, చిలివేరు రాజు, మైల చిన్నరాజు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దాడి మల్లయ్య, మాజీ ఎంపీటీసీ నేరెళ్ల కమలాకర్, సారా కిషన్, గోంగూర రాజ్కుమార్, సిద్దోజు వీరాచారి, తోట శ్రీనివాస్, బండారి వీరస్వామి, కిషన్, శాతరాసి కుమార్, బుర్రి చేరాలు, బెజ్జాల పెద్దన్న, తోట అఖిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఎనకతళ్ల రవీందర్, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్లు బీరం శ్రీలత-రామకృష్ణారెడ్డి, బొళ్ల నరేశ్, మాడిశెట్టి వేణుగోపాల్, ఉప సర్పంచ్ వీసం శ్రీనివాస్రెడ్డి, నాయకులు జిన్నా రామకృష్ణారెడ్డి, నత్తి సుధాకర్, కాంతాల రవీందర్రెడ్డి, తేనేటి రాజారాంరెడ్డి, జనగాం సాంబయ్య, బొల్లెబోయిన రవియాదవ్, వంగాల భగవాన్రెడ్డి, వీర్ల వెంకటరమణ, పోరెడ్డి వనకర్రెడ్డి, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.