హసన్పర్తి, మే 31 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు 21రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, జిల్లా సభ్యుడు సంఘాల విక్టర్ బాబు, మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్కుమార్, ఎంపీపీ సునీతా రాజు, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి, జడ్పీటీసీ సునీతా ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్లు జక్కు రమేశ్ గౌడ్, మేరుగు రాజేశ్ గౌడ్, గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పాపిశెట్టి శ్రీధర్, నరెడ్ల శ్రీధర్, అటికం రవీందర్, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఎంపీడీవో రామకృష్ణ, రబీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాడి మల్లారెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వీసం సురేందర్రెడ్డి, చకిలం రాజేశ్వర్రావు, ఏవో అనురాధ, సెక్రటరీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి
డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
వర్ధన్నపేట : తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాల్లో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం, రైతువేదికలో జరిగిన శతాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో రవీందర్రావు పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన ప్రణాళిక ప్రకారం గ్రామ, మండల స్థాయిల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాలపై ఎంపీపీ అన్నమనేని అప్పారావు సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేసేలా కృషి చేయాలని అధికారులను కోరారు. సమావేశాల్లో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, రైతు సమితి కన్వీనర్ మోహన్రావు, ఏవో రాంనర్సయ్య, కౌన్సిలర్లు రవీందర్, రామకృష్ణ, రాజమణి, సుజాత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా నిర్వహించాలి
ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి
రాయపర్తి : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి కోరారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన ప్రగతి నివేదికలు, ప్రదర్శనలు చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఎస్సారెస్పీ డీఈ కిరణ్కుమార్, ఎంఈవో నోముల రంగయ్య, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, ఎస్సై బండారి రాజు, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, పశు వైద్యాధికారులు వీరగోని శృతి, సోమశేఖర్, ఏఈలు బత్తిని తరుణ్కుమార్, నిఖిల్, బాలదాసు, కార్తీక్రెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో పని చేయాలి
గీసుగొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎంపీడీవో వీరేశం తెలిపారు. బుధవారం మండల పరషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు. జూన్ 3న రైతు వేదికల వద్ద రైతులతో సమావేశం నిర్వహించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని అనంతరం భోజన ఏర్పాట్లు చేయాలని అయన సూచించారు. 8న గ్రామాల్లో ని చెరువుల వద్ద బతుకమ్మలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఏవో హరిప్రసాద్బాబు, ఎంపీవో ప్రభాకర్, ఏపీఎం సురేశ్, ఏపీవో చంద్రకాంత్, ఏఈవోలు, అధికారులు పాల్గొన్నారు.
దశాబ్ది వేడుకల్లో భాగస్వాములు కావాలి
ఎంపీపీ మధుమతి
ఐనవోలు : దశాబ్ది వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ మధుమతి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఎంపీడీవో వెంకటరమణ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులులతో నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములుతో కలిసి హాజయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని అన్ని శాఖాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ పాల్గొని ఉత్సవాలను జయపద్రం చేయాలని కోరారు. సమావేశంలో డీసీవో నాగేశ్వర్రావు, తహసీల్దార్ రాజేశ్, ఎస్సై వెంకన్న, జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్అలీ, మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ సంపత్కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, ఎంపీవో రఘుపతిరెడ్డి, ఏపీఎం రాజ్కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పండుగలా నిర్వహించాలి వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
శాయంపేట : దశాబ్ది ఉత్సవాలను మండల వ్యాప్తంగా పండుగలా నిర్వహించాలని వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. బుధవారం శాయంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వరాష్ట్రంలో పదేళ్లలో చేసిన ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, తహసీల్దార్ రాజు, ఏపీఎం శ్రీధర్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.